Padma Rao Goud: పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంత కృషి చేసింది : పద్మరావు గౌడ్
- By Balu J Published Date - 05:03 PM, Thu - 2 May 24
Padma Rao Goud: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ హైదరాబాద్ అర్చి బిషప్ కార్డినల్ పూల అంటోనిని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి మేడే రాజీవ్ సాగర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ బిషప్ హౌస్ కు చేరుకున్న పద్మారావు బిషప్ ను సత్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంత కృషి చేసిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే 50 లేదా 100 మందితో క్రిస్మస్ ట్రీట్ ఇస్తే కేసీఆర్ అధికారికంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించి వేలాది మందికి క్రిస్మస్ కానుకలు అందజేసినట్లు వివరించారు. బడ్జెట్ లో కూడా క్రిస్టియన్లకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. క్రిస్టియన్ల సంక్షేమానికి బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు
అనంతరం బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ కు ఆశీస్సులు అందజేశారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లియో లెవిస్, సీనియర్ క్యాథలిక్ నాయకులు జుడే రవి, మల్కాజ్ గిరి అల్ పాస్టర్స్ ఫెలో షిప్ చీఫ్ అడ్వైజర్ లియోనార్డ్ మైగర్, క్యాథలిక్ యూత్ నాయకులు జితేష్, కార్తీక్, డేవిడ్ పాల్గొన్నారు.
Related News
Chandrababu Naidu: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం.. పోలింగ్ పై చంద్రబాబు రియాక్షన్
Chandrababu Naidu: రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు అంటూ ఏపీ పోలింగ్ పై రియాక్ట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్�