HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bodies Of 3 Women 2 Children Found In A Well In Rajasthans Dudu Town

Mass Suicide: ముగ్గురు అక్కచెల్లెళ్ళ ఆత్మహత్య.. ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకి.. ముగ్గురి భర్త ఒకరే!!

రాజస్థాన్ లో దారుణం జరిగింది. జైపూర్ జిల్లాలోని దుడు పట్టణంలో ఉన్న ఒక బావిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభించాయి.

  • Author : Hashtag U Date : 29-05-2022 - 10:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suicide
Suicide

రాజస్థాన్ లో దారుణం జరిగింది. జైపూర్ జిల్లాలోని దుడు పట్టణంలో ఉన్న ఒక బావిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభించాయి. అయితే ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనేది తెలియాల్సి ఉంది. గృహ హింసను తాళలేక వీరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అయితే పిల్లల్ని మరెవరైనా చంపి బావిలో పడేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన ముగ్గురు మహిళలు కూడా సొంత అక్కచెల్లెళ్ళు. వారి పేర్లు.. కాలూ దేవి(27), మమత(23), కమలేష్(20). చనిపోయిన ఇద్దరు చిన్నారులు(ఒకరు నాలుగేళ్లు, ఇంకొకరు 27 రోజులు) కూడా.. కాలూ దేవి పిల్లలే. మమత, కమలేష్ ఇద్దరూ గర్భంతో ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురిని చిన్న వయసులోనే ఒకే వ్యక్తికి ఇచ్చి 2003 సంవత్సరంలో పెళ్లి చేశారు.

అతడు రోజూ తాగొచ్చి ముగ్గురు అక్కా, చెల్లెల్లను చిత్రహింసలు పెట్టేవాడని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలు మమత ఫోన్ లోని వివరాలు పరిశీలించిన పోలీసులు ఒక ముఖ్య విషయాన్ని గుర్తించారు. ఆత్మహత్య కు ఒకరోజు ముందు..ఆమె తన వాట్సాప్ స్టేటస్ లో ” “It is better to die once than to die every single day.” అనే మెసేజ్ పెట్టుకుంది. ప్రతి రోజు చస్తూ బతకడం కంటే ఒకేసారి చచ్చిపోవడం మేలు అని దాని అర్ధం. 15 రోజుల క్రితం కూడా భర్త కొట్టడంతో కాలూ దేవి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఇంటికి తిరిగొచ్చిన కొన్ని వారాలకే ముగ్గురు అక్కచెల్లెళ్ళు విగతజీవులుగా మారారు. భర్త అక్కా చెల్లెలు కూడా వారిని తరుచూ వేధించే వారని తెలిసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dudu
  • mass suicide
  • rajasthan

Related News

    Latest News

    • మీరు ఏ వైపు తిరిగి ప‌డుకుంటున్నారు?

    • ఉజ్జయినిలోని బాబా మహాకాల్‌ను దర్శించుకున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌!

    • భార్యను పంపించలేదని అత్త ఇంటికి నిప్పు పెట్టిన అల్లుడు

    • తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం

    • విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రారంభం టోల్ ఫీజు లేకుండానే ప్రయాణం

    Trending News

      • వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

      • జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!

      • రోహిత్ శర్మకు అవమానం జ‌రిగింది.. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కార‌ణ‌మిదే?!

      • ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడ‌ల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd