Telangana Paddy: బీజేపీ మెడకు చుట్టుకుంటున్న తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం బీజేపీ మెడకు చుట్టుకుంటోందా? రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడుతోందా? కేసీఆర్ + పీకే స్కెచ్ లో కూరుకుపోతోందా? ఒకటి కాదు రెండు కాదు.. చాలా ప్రశ్నలు.
- By Hashtag U Published Date - 09:17 AM, Fri - 25 March 22
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం బీజేపీ మెడకు చుట్టుకుంటోందా? రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడుతోందా? కేసీఆర్ + పీకే స్కెచ్ లో కూరుకుపోతోందా? ఒకటి కాదు రెండు కాదు.. చాలా ప్రశ్నలు. ఎందుకంటే ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే.. చాలా విషయాలు అర్థమవుతాయి. మ ధాన్యం కొనమంటూ టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీలో కేంద్రమంత్రులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ వారికి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాత్రం 48 గంటల తరువాతే అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇలాంటి చర్యలు బీజేపీని ఇరకాటంలో పెడతాయంటున్నారు నిపుణులు.
తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు పీయూష్ గోయల్. బియ్యం సేకరణలో దేశమంతా ఒకే విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. పంజాబ్, తెలంగాణలకు వేర్వేరు విధానాలు లేవన్నారు. ముడిబియ్యం ఎంత ఇచ్చినా తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామని.. ఆరు నెలల కిందట తెలంగాణ ప్రభుత్వం కూడా ముడి బియ్యమే ఇస్తామని చెప్పిందని.. కానీ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినా తెలంగాణ మాత్రం ఇవ్వలేదన్నారు. కానీ బీజేపీ గమనించాల్సింది ఏమిటంటే.. కమలం కిందకు నీళ్లు వచ్చేలా ఈ వివాదం పెరిగి పెద్దదవుతోందని.
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు, ప్రజా సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలంటూ ఇప్పటికే వివిధ రైతు సంఘాలు రాష్ట్రాల ప్రభుత్వాలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇది ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా బీజేపీ పై ఒత్తిడి పెంచుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం ఆడే మాట, వేసే అడుగు ఆచితూచి ఉండాలి. ఏమాత్రం లెక్క తప్పినా… టీఆర్ఎస్ క్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందన్న సంగతిని మర్చిపోకూడదు.
అటు తెలంగాణ వ్యవసాయశాఖా మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రంపై విమర్శల దూకుడు పెంచారు. కేంద్రానికి వ్యవసాయ ఆత్మలేదని.. రైతుల, పేదల ప్రభుత్వం కాదంటూ ఫైరయ్యారు. తాము సమస్యను వివరిస్తుంటే.. మీకు గతంలోనే చెప్పాను కదా అని చులకనగా మాట్లాడారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. అందుకే కేంద్రప్రభుత్వం.. వ్యవసాయ నిపుణులు, ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఇలా ఇబ్బంది పెడుతోందనే.. తాము రైతులకు నచ్చజెప్పామన్నారు. అందుకే వరిసాగు 56 లక్షల ఎకరాల నుంచి 36 లక్షలకు తగ్గిందన్నారు. నిరంతర ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు భీమా వంటి రైతు అనుకూల పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని.. మరి తమది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని కేంద్రం ఎలా విమర్శిస్తుందన్నారు. మొత్తానికి ఈ వివాదం రాజకీయంగా ఎవరికి మైలేజ్ ఇస్తుందన్నదానికన్నా.. మధ్యలో రైతులు మాత్రం నలిగిపోతున్నారనే చెప్పాలి.
Tags
Related News
Good News To Farmers : రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్
స్వాతంత్య్ర దినోత్సవానికి ఓ రోజు ముందే తెలంగాణ రైతుల్లో ఆనందం నింపారు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)..కేసీఆర్ సారు..రుణమాఫీ ఎప్పుడెప్పుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్న రైతుల ముఖంలో వెలుగు నింపారు. రైతుల రుణమాఫీ (farmers’ loan waiver scheme) చేస్తానని చెప్పినట్లే కేసీఆర్..ఈరోజు సోమవారం రూ.లక్షలోపు ఉన్న వారి రుణమాఫీ చేసారు. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. సీఎం క�