Delhi: ఢిల్లీలో ప్రతికూల వాతావరణం-18 విమానాలు దారి మళ్లింపు
- By Balu J Published Date - 04:26 PM, Sat - 2 December 23
Delhi: శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 18 విమానాలను దారి మళ్లించినట్లు ఒక అధికారి తెలిపారు. విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్సర్లకు మళ్లించినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.
అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం సైతం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చినా ప్రజలు, రైతులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. నేటికి పంజాబ్ రైతులు తమ పంటలను తగులబెడుతూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నారు. ఈ కారణంగా ఢిల్లీలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.
Tags
Related News
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.