Arvind Kejriwal: మనీష్ సిసోడియాని తలుచుకుని కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని దరియాపూర్ గ్రామంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు.
- By Praveen Aluthuru Published Date - 03:11 PM, Wed - 7 June 23
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని దరియాపూర్ గ్రామంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 35వ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq
— ANI (@ANI) June 7, 2023
ఢిల్లీలో స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 35వ పాఠశాలను ప్రారంభించిన కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లేనందుకు చాలా బాధగా ఉందని చెప్పారు. ఇది మనీష్ సిసోడియా కల. ఈ కార్యక్రమం మనీష్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. అయితే చేయని నేరానికి మనీష్ శిక్ష అనుభవిస్తున్నాడని అరవింద్ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు.మనీష్ గురించి మాట్లాడుతున్న సమయంలో కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కళ్ళు ఎర్రబడ్డాయి. అయినా కంట్రోల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మనీష్ సిసోడియాని చాలా మిస్ అవుతున్నానని అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం కేజ్రీవాల్. మనీష్ మంచి స్కూల్స్ కట్టినందుకు అతన్ని జైల్లో పెట్టారని బీజేపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.
Read More: Muslim Girl: గాయత్రీ మంత్రం ఈ ‘ముస్లిం’ యువతి విజయ రహస్యం!
Related News
Jagan : చెల్లెల్ని మిస్ అవుతున్న అంటూ జగన్ ఎమోషనల్..మరో డ్రామా అంటారా..?
వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నారా అని జర్నలిస్టు అడుగగా.. అవునని జగన్ సమాధానం ఇచ్చారు. ఎందుకు కాదు? తప్పకుండా మిస్ అవుతున్నా.