Home Minister Vanitha : డాగ్ స్క్వాడ్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న హోమంత్రి తానేటి వనిత
మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన 20వ బ్యాచ్ డాగ్ స్క్వాడ్ పరేడ్ కార్యక్రమంలో హోమంత్రి...
- By Prasad Published Date - 11:50 AM, Wed - 28 September 22
మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన 20వ బ్యాచ్ డాగ్ స్క్వాడ్ పరేడ్ కార్యక్రమంలో హోమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శిక్షణ పొందిన డాగ్ స్వ్కాడ్కు హోంమంత్రి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డాగ్ స్క్వాడ్లో ప్రస్తుతం 177 కుక్కలు ఉన్నాయని, వీటితో పాటు మరో 35 కుక్కలను చేర్చనున్నట్లు తెలిపారు. ఈ కుక్కల ఆరోగ్య సంరక్షణ కోసం పశువైద్య నిపుణులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె ప్రకటించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందని హోమంత్రి తానేటి వనిత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Related News
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.