CM Jagan: వరదలపై సీఎం జగన్ రివ్యూ!
రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు.
- By Balu J Published Date - 04:08 PM, Mon - 18 July 22
రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. సీనియర్ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఈ బాధ్యత ఉందన్నారు.
వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలి సీఎం సూచించారు. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలని, ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలని, కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్గా తీసుకోవాలి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో మాట్లారు.
Related News
Lok Sabha Polls 2024: ఆ రాష్ట్రాల్లో ఈ రోజు డ్రై డే
2024 లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడు దశల్లో మూడు పూర్తయ్యాయి. ఈ రోజు మే 13న నాల్గవ దశ జరగనుంది. కాగా ఎన్నికల నేపథ్యంలో కమిషన్ అన్ని రకాల ఆంక్షలను ప్రవేశపెట్టింది. 4వ దశ ఎన్నికల దృష్ట్యా, కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో డ్రై డే కూడా పాటిస్తున్నారు.