AP CM JAGAN: ప్రతికుటుంబానికి తక్షణ సాయం కింద రూ.2వేలు ఇవ్వండి…ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు!!
భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరకోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు.
- By hashtagu Published Date - 02:15 PM, Tue - 12 July 22
భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరకోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. గోదావరికి ఈ ఏడాది ముందుగానే వరదలు వచ్చాయన్నారు. ఈ నెలలోపే 10లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చిందన్నారు. రేపు ఉదయానికి వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు జగన్. ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదన్నారు. కంట్రోల్ రూమ్స్ సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు జగన్. కూనవరం, చింతూరులో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అమలాపురం, వేలూరుపాడు, కూనవరం వీఆర్ పురంలో నాలుగు బృందాలు ఉన్నాయని తెలిపారు. సహాయక శిబిరాల్లో ఏర్పాటు బాగుండాలని సూచించిన సీఎం జగన్, స్వచ్చమైన తాగునీరు, మంచి ఆహారం అందించాలని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రెండు వేలు ఇవ్వాలని తక్షణ సాయంగా ఈ డబ్బు వారికి ఉపయోగపడతుందని చెప్పారు జగన్. రోజువారీ నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు.
Tags
Related News
AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు
ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి