Hyderabad : హైదరాబాద్లో భారీగా నగదు పట్టివేత.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్లో మరో హవాలా రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికలకు కొన్ని గంటల ముందు...
- By Prasad Published Date - 10:17 PM, Wed - 2 November 22
హైదరాబాద్లో మరో హవాలా రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికలకు కొన్ని గంటల ముందు టాస్క్ఫోర్స్ పోలీసులు నగరంలో హవాలా రాకెట్ను ఛేదించి రూ.1.27 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై లెక్కల్లో చూపని నగదును తరలించేందుకు యత్నిస్తున్న ఇద్దరు హవాలా ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిమాయత్ నగర్లో ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా ఫణికుమార్రాజు నుంచి రూ.1.27 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. పోలీసులు అతన్ని విచారించి, అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా ఇద్దరు నిందితులు అంబర్పేట నివాసి మన్నె శ్రీనివాస్ అకా శ్రీను, ఉస్మాన్గంజ్కి చెందిన సి విశ్వనాథ్ చెట్టిని అరెస్టు చేశారు. తాను మన్నె శ్రీనివాస్ కింద కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నానని తెలిపాడు. పట్టుబడిన నగదుతో పాటు నిందితుల్ని నారాయణగూడ పోలీస్స్టేషన్కు టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.