Rajendranagar : రాజేంద్రనగర్లో బయటపడ్డ సొరంగం.. 11 అడుగుల..?
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఓ సొరంగం బయటపడింది. అత్తాపూర్లోని కుతుబ్షాహీ కాలం నాటి ముష్క్మహల్లో గతంలో
- By Prasad Published Date - 07:13 AM, Thu - 27 April 23
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఓ సొరంగం బయటపడింది. అత్తాపూర్లోని కుతుబ్షాహీ కాలం నాటి ముష్క్మహల్లో గతంలో తెలియని సొరంగాన్ని కొందరు యువకులు కనుగొన్నారు. వివరాల ప్రకారం, కొంతమంది యువకులు ఫోటో షూట్ కోసం 300 సంవత్సరాల పురాతన ముష్క్ మహల్ను సందర్శించారు. ఆ సమయంలో ఆ మహల్ లోపల ఒక సొరంగాన్ని కనుగొన్నారు. గుప్త నిధిని కనుగొనాలనే ఉద్దేశ్యంతో వారు సొరంగం లోపలికి వెళ్లినట్లు తెలుస్తుంది. కానీ సొరంగం ప్రారంభంలో 11 అడుగుల నాగుపాము వారి ముందు కనిపించడంతో వారు భయంతో పారిపోయారు. ఇప్పుడు ఈ సొరంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ యువకులు ఈ సొరంగం వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.