HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Amedkar Statue Politics In Telangana

Amedkar Statue Politics: అంబేడ్కర్ విగ్రహం చుట్టూ నడిచిన రాజకీయం…

ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల డా:బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఆవిష్కృతమైంది. ఈ అంశాన్ని అధికార పార్టీ, ప్రతిపక్షాలు కేవలం తమ స్వార్ధ రాజకీయాల కోసమే వాడుకున్నాయి

  • Author : Vamsi Chowdary Korata Date : 14-04-2023 - 6:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ambedkar statue politics
Ambedkar Statue (1)

Amedkar Statue Politics: ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల డా:బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఆవిష్కృతమైంది. ఈ అంశాన్ని అధికార పార్టీ, ప్రతిపక్షాలు కేవలం తమ స్వార్ధ రాజకీయాల కోసమే వాడుకున్నాయి అనిపిస్తుంది. ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అయితే కేవలం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చింది అంటుంది అధికార పార్టీ. ఈ విమర్శలు ప్రతి విమర్శలకు అంబేడ్కర్ విగ్రహం అడ్రస్ కావడం బాధాకరం. ఇక్కడ ప్రజలు ఎవరి మాటలు నమ్మాలో తెలియక అయోమయంలో పడుతున్నారు.

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నగరం నడిబొడ్డున భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కానీ విగ్రహ ఆవిష్కరణపై ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఎవరెవరు ఏమన్నారో చూద్దాం. ముందుగా అధికార పార్టీ నాయకుల వ్యవహారం గమనిస్తే…అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజానికి ఈ మాట కేటీఆర్ మొదటి సారి అన్నారు. ఇదివరకెప్పుడూ అంబేడ్కర్ వల్లనే తెలంగాణ వచ్చినట్టు చెప్పిన దాఖలాలు లేవు.

ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకంగా అంబేడ్కర్ జయంతి నాడు ప్రతి ఏడాది అవార్డులు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఇంతకీ అవార్డుల ఇవ్వడం వల్ల ప్రజలకు జరిగే మేలు ఏంటి? 50 కోట్లు డిపాజిట్ చేసి వచ్చే మూడు కోట్ల వడ్డీ సొమ్ముని ఈ అవార్డులకు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఇంతకీ ఆ అవార్డులు ఎవరడిగారు? ప్రజల శ్రేయస్సు కోరితే అవార్డులా ఇవ్వాల్సింది?. ఇక ఆయన స్పీచ్ లో అంబేడ్కర్ ఉత్సవాలను జరుపుకోవడమేనా… ఆయన ఆశయాలను సాధించొద్దా అంటూ చెప్పుకొచ్చారు. అసలు అంబేడ్కర్ ఆశయాలు ఏంటి? ఆయన ఆశయాలు సాధనలో కీలకం ప్రభుత్వాలే కదా. మరి ఆయన ఆశయాలను సాధించే క్రమంలో అధికార పార్టీ చేసేది అవార్డులు ఇవ్వడం ఒక్కటేనా? దేశంలోనే భారీ విగ్రహం పెట్టామని చెప్పుకుంటారు మునుముందు. సరే…. పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే ఆయన ఆశయాలు నెరవేర్చినట్టా?. ఇలా అధికార పార్టీ అంబేడ్కర్ జయంతి రోజున కానిచ్చేసింది.

తెలంగాణా ( Telangana )లో ప్రతి పక్షాలు చూసుకుంటే కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా చెప్పుకోవాలి. అయితే ఈ రోజు వారేమైనా ప్రజలను దృష్టిలో ఉంచుకుని అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణపై మాట్లాడారా అంటే అదీ లేదు. కెసిఆర్ అంబేడ్కర్ ఆశయాలకు వ్యతిరేకి, దళితుడిని సీఎం చేయలేదు, కెసిఆర్ దళితులకు వ్యతిరేకం అని మాట్లాడారు. దళిత సీఎం అనేది గతం. 2014 లో దళితుడిని సీఎం చేస్తానన్న కెసిఆర్ చేయలేదు. ఇంకెన్నాళ్లు దళితుడు సీఎం అంటూ రాజకీయ పబ్బం గడుపుతారు. నిజంగా దళితులపై అంత ప్రేమ ఉంటె వారి శ్రేయస్సుకు మీరేం చేస్తారో చెప్పాలి కదా. అది కాకుండా విమర్శలు చేయడం ద్వారా ఎవరికీ నష్టం? ఎవరికీ లాభం? ఇక్కడ ప్రజలు ఎక్కడ కనిపిస్తున్నారు. రోజంతా చెరొక మాట అనుకోవడమే కనిపించింది.

అసలు అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ రోజు ఎందుకిత రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు మాట్లాడితే ప్రజలు వింటారు, చూస్తారు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు అన్న కాన్సెప్ట్ మాత్రమే బట్టబయలు అయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్మ్ బీజేపీ ఈ మూడు పార్టీలు ఈ రోజు మాట్లాడిన మాటల వల్ల ఏమైనా లాభం కనిపించిందా? ఒకవేళ లాభం చేకూరితే అది రాజకీయ నేతలకే తప్ప మరింకేం లేదు. ఇది స్పష్టం. సమయం చూసి మీద పడ్డట్టు ఉంది ఈ రోజు అధికార పక్షం, విపక్షం వ్యవహారం గమనిస్తే.

Read More: Dr. Br Ambedkar : ఈరోజు డా.బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కంచు విగ్రహం ఆవిష్కరణ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amedkar Statue
  • bjp
  • brs
  • congress
  • politics
  • telangana
  • Telangana Political News

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd