IPL: గుజరాత్ టైటాన్స్ బోణీ
ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తమ ఎంట్రీని గ్రాండ్ గా ఇచ్చింది. తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- By Naresh Kumar Published Date - 02:48 AM, Tue - 29 March 22
ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తమ ఎంట్రీని గ్రాండ్ గా ఇచ్చింది. తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను అలరించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో ఎవరూ ఊహించని విధంగా తడబడింది. షమీ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీయడంతో లక్నో 29 పరుగులకే కీలక 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సీనియర్ ప్లేయర్ దీపక్ హుడా(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 55)తో కలిసి యువ ఆటగాడు ఆయూష్ బాదోని(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. వీరిద్దరూ 5వ వికెట్కు 87 పరుగులు జోడించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా..వరుణ్ ఆరోన్ రెండు, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కూడా తడబడింది. కేవలం 15 పరుగులకు 2 వికెట్లు చేజార్చుకుంది. శుబ్ మన్ గిల్ డకౌట్ అవగా…విజయ్ శంకర్ విఫలమయ్యాడు. అయితే వేడ్, హర్ధిక్ పాండ్య ధాటిగా ఆడడంతో కోలుకుంది. హర్థిక్ 33, వేడ్ 30 రన్స్ కు ఔటయ్యారు. ఈ దశలో డేవిడ్ మిల్లర్, తెవాటియా జట్టుకు ఆపద్భాంధవులయ్యారు.ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు చేయాల్సి ఉండగా… దీపక్ హుడా వేసిన 16వ ఓవర్లో తెవాటియా 6, 4 కొడితే మిల్లర్ కూడా 4, 6 బాదేశాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఇదే జోరుతో తెవాటియా… రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్నూ ఆడుకున్నాడు. ఒక సిక్స్, 2 ఫోర్లతో ఆ ఓవర్లో కూడా 17 పరుగులు రావడంతో విజయసమీకరణం 18 బంతుల్లో 29 పరుగులుగా మారిపోయింది.18వ ఓవర్లో మిల్లర్ను అవేశ్ అవుట్ చేయగా… అభినవ్ మనోహర్ క్రీజులోకి వచ్చాడు. ఆఖరి 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా… 19వ ఓవర్లో చమీర 9 పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో మనోహర్ రెండు బౌండరీలు, తెవాటియా ఫోర్తో టైటాన్స్ విజయం సాధించింది.
Photo Courtesy- HardikPandya/Twitter
We’ve arrived 💪 So proud of the boys for the fight they showed out there 👏 @gujarat_titans pic.twitter.com/LerjplGihP
— hardik pandya (@hardikpandya7) March 28, 2022
Related News
Rohit Sharma: ముంబై తరుపున రోహిత్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదేనా..?
ఐపీఎల్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో జట్లు తలపడనున్నాయి. అయితే రోహిత్ శర్మ ముంబై తరుపున ఇదే చివరి మ్యాచ్ అని అంటున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో రోహిత్ ను మరో జట్టులో చూడొచ్చని కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.