Agnipath Row: అగ్ని వీరులపై సిటీ పోలీస్ ఫోకస్!
రాజ్ భవన్లో ప్రధాని నరేంద్ర మోడీ బస చేయడంపై నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.
- Author : Balu J
Date : 28-06-2022 - 4:35 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు, రాజ్ భవన్లో ప్రధాని నరేంద్ర మోడీ బస చేయడంపై నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ప్రధానిని నోవాటెల్ హోటల్కు తరలించాలని పోలీసు అధికారులు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)ని కోరారు. పైన పేర్కొన్న అంశం కాకుండా, రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్భవన్ను ముట్టడించారు.
మాదాపూర్లోని నోవాటెల్ హోటల్ ప్రాంగణంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్కు రావాల్సి ఉంది. జూలై 3న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా దాదాపు 10,000 మంది బిజెపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ తన ఉనికిని చాటేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.