4 Die After Car Rams Into Bus: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని దహను ప్రాంతంలో హైవేపై కారు, లగ్జరీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారాన్ని పాల్ఘర్ పోలీసులు తెలిపారు.
- Author : Gopichand
Date : 31-01-2023 - 9:06 IST
Published By : Hashtagu Telugu Desk
ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని దహను ప్రాంతంలో హైవేపై కారు, లగ్జరీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారాన్ని పాల్ఘర్ పోలీసులు తెలిపారు. కారు గుజరాత్ నుంచి ముంబైకి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతలో కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. అనంతరం బస్సును కారు ఢీకొట్టింది.
ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారు, లగ్జరీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా నలుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. దహను తాలూకాలోని చరోతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాలక్ష్మి దేవాలయం సమీపంలో తెల్లవారుజామున 3 నుంచి 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం గుజరాత్ నుంచి ముంబై వైపు వస్తున్న కారు డ్రైవర్ అదుపు తప్పి లగ్జరీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. ప్రమాదంలో లగ్జరీ బస్సు డ్రైవర్తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.
Also Read: Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. ఖండించిన భారత కాన్సులేట్ కార్యాలయం
ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను కాసాలోని ఉప జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. మృతదేహాలను కూడా పోస్టుమార్టంకు తరలించారు. జనవరి 8న కూడా ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు.