HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Special
  • >Who Is Bigger Hindutva Leader Modi Or Rahul

Hindutva Leader: ఎవ‌రు ఎక్కువ హిందూత్వ వాది?

స్వతంత్రం వ‌చ్చాక నాలుగు ద‌శాబ్దాల పాటు ఎన్నిక‌లు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ పోరులానే సాగాయి. ప్ర‌జా స‌మ‌స్య‌లు, అవినీతి ప్ర‌ధాన అంశాలుగా ఎన్నిక‌ల్లో ప్ర‌చారం జ‌రిగేది. కాని 1990వ ద‌శ‌కం నుంచి దేశ రాజ‌కీయాల్లో మ‌తం ప్ర‌వేశించింది.

  • By Hashtag U Published Date - 07:30 AM, Tue - 1 February 22
  • daily-hunt
Pm Modi Vs Rahul Gandhi Imresizer
Pm Modi Vs Rahul Gandhi Imresizer

స్వతంత్రం వ‌చ్చాక నాలుగు ద‌శాబ్దాల పాటు ఎన్నిక‌లు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ పోరులానే సాగాయి. ప్ర‌జా స‌మ‌స్య‌లు, అవినీతి ప్ర‌ధాన అంశాలుగా ఎన్నిక‌ల్లో ప్ర‌చారం జ‌రిగేది. కాని 1990వ ద‌శ‌కం నుంచి దేశ రాజ‌కీయాల్లో మ‌తం ప్ర‌వేశించింది. స్వ‌తంత్ర పోరాటంలో పాల్గొన్న చ‌రిత్ర లేని, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ పూర్తిగా హిందూత్వ అంశం ఆధారంగానే రాజ‌కీయాలు చేయ‌డం ప్రారంభించింది. ఈ దేశంలో ఓట్ల కోసం మైనారిటీల‌ను కాంగ్రెస్ లేదా సంకీర్ణ ప్ర‌భుత్వాలు బుజ్జ‌గిస్తున్నాయ‌ని విమ‌ర్శిస్తూ, అప్ప‌టికే వేడెక్కిన అయోధ్య బాబ‌రీ మ‌సీదు, రామ మందిరం వివాదంతో మ‌తాన్ని, రాజ‌కీయాల‌ను క‌ల‌గాపుల‌గం చేసింది బీజేపీ నాయ‌క‌త్వం. బోఫోర్స్ కుంభ‌కోణం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో …కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చిన వీపీ సింగ్ సార‌థ్యంలో నేష‌న‌ల్ ఫ్రంట్ విజ‌యం సాధించింది. ఈ సంకీర్ణ ప్ర‌భుత్వానికి బీజేపీ బ‌య‌టినుంచి మ‌ద్ద‌తిచ్చింది. మ‌ద్ద‌తిచ్చే స్థాయి నుంచి అధికారం పొందే స్థాయికి ఎద‌గాలంటే త‌న విశ్వ రూపం చూపించాల‌ని బీజేపీ నాయ‌క‌త్వం అనుకుంది. బీజేపీలో అతివాద నాయ‌కుడిగా పేరున్న ఎల్ కే అద్వానీ అయోధ్య రామ‌మందిరం కోసం ర‌థ‌యాత్ర నిర్వ‌హించి దేశంలో హిందువులు, ముస్లింల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు రెచ్చ‌గొట్టారు. అయోధ్య ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికారం సాధించారు. కేంద్రంలో పీవీ న‌ర‌సింహారావు నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఇదే అద‌నుగా 1992 డిసెంబ‌ర్ 6న కాషాయ సేన‌లు క‌ర‌సేవ‌కుల రూపంలో ల‌క్ష‌న్నర మంది అయోధ్య‌ను చుట్టుముట్టి బాబ‌రీ మ‌సీదును కూల‌గొట్టారు. ఫ‌లితంగా దేశ‌మంతా మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగి వేలాది మంది చ‌నిపోయారు.

యూపీలో ముఖ్య‌మంత్రిగా బీజేపీ నేత క‌ల్యాణ్ సింగ్ ఉన్న‌పుడే బాబ‌రీ మ‌సీదు కూల్చారు. అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కూడా మౌనం దాల్చ‌డ‌మే ఇంత‌టి దారుణానికి కార‌ణ‌మైంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. బాబ‌రీ మ‌సీదు విష‌యంలో బ్రిటిష్ వారి కాలంలోనే 1859లో వివాదం మొద‌లైతే మ‌సీదుకు కంచె ఏర్పాటు చేశారు. అయితే స్వ‌తంత్రం వ‌చ్చాక 1949లో మ‌సీదులో రాముడి విగ్ర‌హాలు ఏర్పాటు చేశారు. ఇక అప్ప‌టి నుంచి వాటిని అక్క‌డి నుంచి తీయ‌లేదు. 1986లో కాంగ్రెస్ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ కాలంలోనే రాముడి విగ్ర‌హాల‌కు పూజ‌లు చేయ‌డానికి అనుమ‌తిచ్చారు. 1992లో బాబ‌రీ మ‌సీదును కూల్చి రామ మందిరం నిర్మాణానికి దారి తీసిన మూడు ప్ర‌ధాన సంఘ‌ట‌న‌లు సంభ‌వించిన‌పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలే ఉన్నాయి. మ‌తం పేరుతో హిందువుల భావోద్వేగాలు రెచ్చ‌గొట్టి ఓట్లు కొల్ల‌గొట్ట‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తే…తాను కూడా హిందుత్వ విష‌యంలో ఏమాత్రం త‌గ్గేదే లే అని కాంగ్రెస్ కూడా ప్ర‌తి సారీ స‌హ‌క‌రించింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బీజేపీ పూర్తిగా అయోధ్య రామ‌మందిరం, హిందూత్వ కార్డ్ తో ఓట్ల వేట ప్రారంభించడంతో, కాంగ్రెస్ కూడా అదేబాట‌లో న‌డుస్తోంది. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా కాంగ్రెస్ యువ‌రాజు రాహ‌ల్ గాంధీ… తాను కూడా హిందువునే అని చెప్పుకోవ‌డానికి ఆల‌యాల వెంట తిరుగుతున్నారు. కాని అతి వాద హిందూత్వ వాద పార్టీగా బీజేపీకున్న పేరు ముందు రాహుల్ హిందుత్వ‌వాదం ప‌నిచేయ‌డంలేదు. ఇప్పుడు యూపీ ఎన్నిక‌ల్లో కూడా రాహుల్ గాంధీ ఇదే ట్రంప్ కార్డ్ ను ప్ర‌యోగిస్తున్నారు. దేశంలో అతి ఎక్కువ హిందుత్వ వాదులు బీజేపీలో ఉన్నారా…కాంగ్రెస్ లో ఉన్నారా? ఎవ‌రు ఎక్కువ హిందుత్వ వాది అనే చ‌ర్చ దేశంలో న‌డుస్తోంది.

ఇక ప్ర‌జ‌లంతా స‌మానులు కాదంటూ…మాంసాహారం తినేవారిని హేళ‌న చేసే శ్రీ త్రిదండి చిన జీయ‌ర్ స్వామి… స‌మ‌తామూర్తి, వెయ్యేళ్ళ‌నాడే మాన‌వులంతా స‌మాన‌మ‌ని బోధించిన శ్రీ రామానుజుల విగ్ర‌హాన్నిహైద‌రాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు వ్య‌య‌మే వెయ్యి కోట్ల రూపాయ‌లు. ఒక మ‌తాన్ని వ్య‌తిరేకిస్తూ…హిందూమ‌త‌మే స‌ర్వోత‌న్న‌త‌మైన‌దని కీర్తించే బీజేపీకి చెందిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ శ్రీ రామానుజుల విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రాబోతున్నారు. జాతి పిత గాంధీని హ‌త్య చేసిన గాడ్సేని ప్రేమించే బీజేపీ నాయ‌కులు ఈ మ‌త కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతున్నారు. జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ హ‌యాంలో వంద‌ల కోట్ల ఖ‌ర్చుతో ప్రాజెక్టులు నిర్మిస్తే…ఇప్పుడు వేల కోట్ల ఖ‌ర్చుతో విగ్ర‌హాలు ఏర్పాటు చేస్తున్నారు. భార‌త‌దేశం లౌకిక రాజ్యం అని రాజ్యాంగంలో రాసుకున్నాం. కాని ప్ర‌ధానులు, ముఖ్య‌మంత్రులు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప్రాజెక్టుల కంటే వంద‌ల‌, వేల కోట్ల‌తో విగ్ర‌హాలు, ఆల‌యాలు నిర్మించ‌డానికే ప్రాధాన్య‌మిస్తున్నారు. నాలుగు ద‌శాబ్దాలుగా దేశంలో మారిన రాజ‌కీయాలతో, పార్టీలు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కంటే మ‌తానికే ప్రాధాన్య‌మిస్తున్నాయి. బాబ‌రీ మ‌సీదును కూల్చిన గుంపులో ఉన్న శివసేన‌తో ఇప్పుడు మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వాన్ని న‌డుపుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంత‌కీ భార‌త్ ఇప్పుడు లౌకిక రాజ్య‌మా ? మ‌త రాజ్య‌మా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • hindu leader
  • hindustva
  • prime minister narendra modi
  • rahul gandhi

Related News

CM Revanth Reddy

Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

కవిత చెబుతున్నట్టు నేను ఆమె వెనుక ఉన్నానంటారు. ఇంకొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానంటున్నారు. ఈ రాజకీయ పంచాయితీలు ప్రజలకు అవసరం లేదు. నన్ను మీ కుటుంబ, కుల రాజకీయాల్లోకి లాగొద్దు అని రేవంత్ స్పష్టంగా అన్నారు.

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

  • Cbi Kcr

    CBI Enquiry on Kaleshwaram Project : కేసీఆర్ పై యాక్షన్ ..? బిజెపి భయపడుతోందా..? కారణం అదేనా..?

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

Latest News

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd