HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Will Bjp Politics Work In Karnataka

BJP Politics : కర్ణాటకలో కమల రాజకీయం ఫలిస్తుందా?

కర్ణాటకలో జనతా సెక్యులర్ బీజేపీ (BJP) మధ్య ఒక ఖచ్చితమైన రాజకీయ ఒప్పందం కుదిరినట్టు తాజా వార్తలు తెలియజేస్తున్నాయి.

  • Author : Hashtag U Date : 23-09-2023 - 6:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Will Bjp Politics Work In Karnataka.
Will Bjp Politics Work In Karnataka.

By: డా. ప్రసాదమూర్తి

BJP Politics in Karnataka : సరిగ్గా 16 సంవత్సరాల క్రితం తెగిపోయిన బంధం తిరిగి అతుక్కుంది. కర్ణాటకలో జనతా సెక్యులర్ బీజేపీ (BJP) మధ్య ఒక ఖచ్చితమైన రాజకీయ ఒప్పందం కుదిరినట్టు తాజా వార్తలు తెలియజేస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన బిజెపి, జనతాదళ్ (ఎస్) రెండూ తక్షణం అంతర్ మథనం, ఆత్మ విమర్శ, ఆత్మావలోకనం చేసుకొని, పాత కక్షలు, తగాదాలు, వైరుధ్యాలు, ఘర్షణలు పక్కనపెట్టి ఏకం కావాలని నిర్ణయించుకున్నాయి. కర్ణాటక విజయంతో చాలా ఉత్సాహంగా ఉరకలేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అడ్డుకట్ట వేయడానికి అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ అవకాశాన్నీ బిజెపి వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో కోల్పోయిన ప్రాభావాన్ని, గత వైభవాన్ని తిరిగి పొందాలంటే జేడీఎస్ తో పొత్తు తప్పనిసరి అని బిజెపి గమనించినట్లు ఉంది.

జనతాదళ్ (ఎస్) పేరులోనే సెక్యులర్ అనే పదం ఉంది. ఈ పార్టీతో, సెక్యులర్ అనే పదంతోనే పేచీ ఉన్న బిజెపికి రాజకీయ పొత్తు ఎలా సంభవం అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అవన్నీ సిద్ధాంతాల వరకే. రాజకీయంలో మాత్రం ఎన్నికలలో గెలుపు, అందలాల వైపు పరుగు మాత్రమే పరిగణనలోకి వస్తాయి. అందుకే జనతాదళ్ ఎస్ గతంలో కర్ణాటకలో బిజెపి పొత్తు పెట్టుకుంది. అయితే ఆ పొత్తు గమ్మత్తుగా మాయమైన చరిత్ర మాత్రం ఎవరూ మర్చిపోలేం.

రెండు పార్టీలూ చెరిసగం కాలం ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని ఒప్పందం ఆనాడు జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పదవీకాలం రెండున్నరేళ్లు ముగిసిన తర్వాత బిజెపికి ఆ పదవిని అందజేయాలి. అందుకు జెడి (ఎస్) నో చెప్పింది. అదిగో అక్కడ అలా ముగిసిపోయింది ఆ బంధం. రాజకీయాలంటేనే ఎలాంటి శాశ్వత నియమ నిబంధనలు, ఒప్పందాలు, ప్రమాణాలు పనికిరావు. అంతా తాత్కాలికమైన వొడంబడికే ఉంటుంది. ఇది జనతాదళ్ సెక్యులర్ పార్టీ కమలనాధులకు ఆనాడు చెప్పిన సమాధానం. మరి అలా తెగిపోయిన బంధం ఇప్పుడు ఎలా అతికింది అంటారా, అదే రాజకీయం. అవసరం పాత కక్షలు, గతకాలపు వైరాన్ని మాయం చేసి, ముందున్న తక్షణ ఫలితాలను మాత్రమే ప్రధానమైనవిగా చేస్తుంది. మరి ఈ రెండు పార్టీలకి మధ్య ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా సయోధ్య కుదరాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాం.

కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముక్కోణపు పోటీ జరిగింది. దాంట్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మైసూర్ ప్రాంతంలో బలంగా ఉన్న జెడిఎస్ కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. జెడిఎస్, వక్కలిగ సామాజిక వర్గానికి కర్ణాటకలో బలమైన ప్రతినిధిగా చెప్తారు. బిజెపికి లింగాయతుల మద్దతు ఉంది. జెడిఎస్ తో ఒప్పందం పెట్టుకుంటే వక్కలిగ సామాజిక వర్గం మద్దతు కూడా తమకు ఉంటుంది. అలాగే విడివిడిగా పోటీ చేయడం వల్ల ఎలాంటి దెబ్బ తగిలిందో అసెంబ్లీ ఎన్నికలు చెబుతున్నాయి. కనుక ఇక తప్పనిసరిగా జెడిఎస్ తో బంధాన్ని పునరుద్ధరించుకోవడానికే బీజేపీ (BJP) సిద్ధమైంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం ఎలా కుదురుతుంది అనేది కూడా ఒక సమస్య. ఈ విషయంలో కూడా రెండు పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టుగా కనిపిస్తోంది. మైసూర్ ప్రాంతంలో ఉన్న 14 లోక్ సభ స్థానాల్లో నాలుగు సీట్లు జెడిఎస్ కి కేటాయించడానికి బిజెపి అంగీకరించినట్టుగా అర్థమవుతుంది.

మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలియజేశారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేడిఎస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. కాబట్టి ఇరు పార్టీలకు ఈ బంధం పునరుద్ధరణ అనివార్యమైంది. ఇప్పటికే హెచ్ డి దేవగౌడ, ప్రధాని మోడీ మధ్య సామరస్య పూర్వక చర్చలు సాగినట్టుగా యడ్యూరప్ప చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమార్ స్వామిని ఆయన నివాసం వద్ద హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు. తమ కలయిక ఫలప్రదమైందని వారు తెలియజేశారు.

కలియకలు, సమావేశాలు ఫలప్రదం కావడం అంటే రాజకీయ ఒప్పందాలు ఒక కొలిక్కి రావడమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు ఇదే కాబోలు. 16 సంవత్సరాల క్రితం తమకు ద్రోహం చేశారని, నమ్మించి వెన్నుపోటు పొడిచారని, చేసిన వాగ్దానం నెరవేర్చకుండా మాట తప్పారని బిజెపి ఏ పార్టీ మీదైతే నిందలు మోపిందో, ఆరోపణలు చేసిందో, అదే పార్టీతో ఇప్పుడు చేయి చాపి రాజకీయ కౌగిలింతకు ఉత్సాహం చూపింది. వీరి కలయిక కర్ణాటకలో రాజకీయ సమీకరణాలలో కొన్ని అనివార్యమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. విజయోత్సాహంతో ముందుకు దూసుకుపోతున్న కాంగ్రెస్ ఈ కలయికను ఎలాంటి శక్తితో ఎదుర్కొంటుందో చూడాలి. ఏది ఏమైనా సిద్ధాంతాలు వేరు, రాజకీయ ప్రయోజనాలు వేరు. నాయకులు రాజకీయ ప్రయోజనాలే చూస్తారు అని ఈ తాజా పరిణామం మనకు చెబుతోంది.

Also Read:  CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక‌?, `పోచారం` రియాక్ష‌న్ తో అప్ర‌మ‌త్తం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • Ex CM
  • india
  • karnataka
  • ministers
  • politics
  • rahul gandhi

Related News

Kerala Ex Cm

Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

కేరళలో సీపీఐ-ఎం సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం సమీపంలో ఈడీ సోదాల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోదాలు ముగిసిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందం వెళ్తుండగా, వాహనాలపై సీపీఐ ఎం కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఈ ఘటనలో ఈడీ బృందానికి చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో వాహనాల అద్దాలు పగలడంతో డ్రైవర్లు, భద్రతా స

  • Ev Bus

    EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

  • V.D. Satheesan Sworn In as Kerala CM

    Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

  • Nirmala Sitharaman Makes Key Remarks on Economic Challenges

    Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd