HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Swaminathan The Country Owes You

M.S. Swaminathan : స్వామినాథన్.. నీకు దేశమే రుణపడింది

ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) మరణం భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకి తీరని లోటు.

  • By Hashtag U Published Date - 11:05 AM, Fri - 29 September 23
  • daily-hunt
Swaminathan.. The Country Owes You
Swaminathan.. The Country Owes You

By: డా. ప్రసాదమూర్తి

M.S. Swaminathan : కొందరు వ్యక్తులుగానే పుడతారు. ప్రభుత్వాలే చేయలేని మహత్తర కృషి చేసి మహా శక్తులుగా ఎదుగుతారు. పుటుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది అన్నట్టు వారు బతుకుతారు. అలాంటి మహనీయుడే ఎం.ఎస్.స్వామినాథన్. పాల విప్లవానికి కొరియన్ ఎంతటి వాడో, హరిత విప్లవంలో స్వామినాథన్ అంతటి వాడు. మన దేశం జోలె పట్టుకుని ప్రపంచ దేశాల ముందు ఆహారం కోసం నిలబడే దుస్థితి నుంచి తన అపారమైన పరిశోధనా శక్తితో కాపాడిన ఘనుడు. ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) మరణం భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకి తీరని లోటు. అయితే కాలానికి ఎంతటి వారైనా లొంగ వలసిందే కదా. నూరేళ్ల జీవితానికి అతి చేరువుగా వెళ్లి 98 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. కానీ వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషి, పరిశోధన భారతదేశానికి చేసిన దిశా నిర్దేశం.. కాలం ఉన్నంతకాలం గుర్తుపెట్టుకోవాల్సిందే. భారతదేశానికి చెందిన ఈ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ రంగానికి చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అంతులేని పుస్కారాలు పొందారు. అయితే పురస్కారాల ద్వారా వచ్చిన మొత్తాన్ని తన పరిశోధనా రంగానికే వినియోగించిన విశిష్ట వ్యక్తి స్వామినాథన్.

WE ARE ON WHATSAPP CHANNEL: FOLLOW US

స్వామినాథన్ 1931లో తమిళనాడులోని తిరునల్వేలిలో జన్మించారు. ఆయన 1953లో హర్యానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఆ తర్వాత, ఆయన కేంద్ర వ్యవసాయ మరియు అనుబంధ రంగాల పరిశోధనా మండలి (ICAR)లో చేరారు. ఆయన 1986లో ICAR యొక్క డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. స్వామినాథన్ (M.S. Swaminathan) భారతదేశ వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలను ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన “హరిత విప్లవం” కార్యక్రమం భారతదేశంలో పంట ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. ఆయన రూపొందించిన “బహుళ పంట వ్యవస్థ” భారతదేశంలో పంట వివిధతను పెంచడంలో సహాయపడింది.

స్వామినాథన్ వ్యవసాయ రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు. పద్మశ్రీ (1967), రామన్ మెగసెసే (1971) పద్మభూషణ్ (1972), పద్మవిభూషణ్ (1989), వరల్డ్ పుడ్ ప్రైజ్ (1987), ఇందిరా గాంధి శాంతి పుస్కారం (1999), ఇందిరాగాంధి జాతీయ సమైక్యతా పుస్కారం (2013), ఇలాంటి దేశీయ పురస్కారాలతో పాటు అమెరికన్ సైన్స్ అకాడెమీ ఫెలోషిప్, వరల్డ్ అగ్రికల్చర్ సైన్స్ అవార్డ్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వ్యవసాయ సాంకేతిక అవార్డ్, ఇలా అనేకానేక అవార్డులను ఆయన కైవశం చేసుకున్నారు.

స్వామినాథన్ (M.S. Swaminathan) చేసిన కృషి ప్రభావం

స్వామినాథన్ వ్యవసాయ రంగంలో సాగించిన కృషి భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆయన చేసిన కృషి కారణంగా, భారతదేశం ఆహార భద్రతను సాధించడంలోనూ వ్యవసాయ రంగంలో అభివృద్ధిని స్వావలంబనను సాధించడంలో విజయం సాధించింది. స్వామినాథన్ కృషి చూపిన కొన్ని ప్రధాన ప్రభావాలు తలుచుకుంటే వాటిలో అతి కీలకమైనవిగా వీటిని చెప్పుకోవచ్చు. భారతదేశంలో పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.భారతదేశం ఆహార భద్రతను సాధించింది.వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించింది.రైతుల ఆదాయం పెరిగింది.వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్వామినాథన్ భారతదేశ వ్యవసాయ రంగానికి మార్గదర్శకుడిగా కలకాలం మన దేశ చరిత్రపుటల్లో నిలిచిపోతారు. ఆ మహనీయునికి ఘన నివాళి.

Also Read:  TDP : చంద్రబాబు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్ర‌భుత్వం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agriculture
  • farmer
  • Green Revolution
  • india
  • M.S. Swaminathan

Related News

Vande Mataram

Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రభుత్వం నాలుగు దశల్లో ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 7, 2025న ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జరగనుంది.

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd