Schools: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవు!
ఎన్సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న పొగమంచు, ధూళి, విష వాయువుల మిశ్రమం చిన్న పిల్లల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
- Author : Gopichand
Date : 13-11-2025 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Schools: రాజధాని ఢిల్లీతో సహా ఎన్సీఆర్ జిల్లాల్లో గత కొద్ది రోజులుగా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని హర్యానా ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. కాలుష్యం నిరంతరం పెరుగుతున్న కారణంగా ఎన్సీఆర్లో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడవ దశను అమలు చేశారు. దీంతో పెరుగుతున్న ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలను పరిగణలోకి తీసుకుని 5వ తరగతి వరకు ఉన్న తరగతులకు పాఠశాలలను (Schools) మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాన్ని పాటించాలని హర్యానా మాధ్యమిక విద్యా డైరెక్టరేట్ ద్వారా అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చారు.
5వ తరగతి వరకు తరగతులు మూసివేత
ఢిల్లీతో సహా ఎన్సీఆర్ ప్రాంతంలోని ఉపాయుక్తులు తమ తమ జిల్లాల్లోని గాలి నాణ్యత వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలి. ఏక్యూఐ స్థాయి తీవ్రమైన కేటగిరీలో కొనసాగితే ప్రభుత్వ- ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ నుండి 5వ తరగతి వరకు ఉన్న ఆఫ్లైన్ తరగతులను మూసివేయాలని ఆదేశించారు. దీని స్థానంలో పాఠశాలలు ఆన్లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో బోధనను కొనసాగించాలని సూచించారు.
Also Read: Gold Rate Today: బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. సీన్ రివర్స్..!
అదనంగా గాలి నాణ్యతను అంచనా వేసేటప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేర్వేరుగా చూడాలని కూడా ఆదేశించారు. కొన్నిసార్లు పట్టణ ప్రాంతాల్లో ఏక్యూఐ తీవ్రంగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్ట ఏక్యూఐ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలను పాటించాలి.
ఎన్సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న పొగమంచు, ధూళి, విష వాయువుల మిశ్రమం చిన్న పిల్లల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కాలుష్యానికి మరింత త్వరగా ప్రభావితమవుతారు. అందుకే పాఠశాలలను మూసివేసి, ఇళ్ల నుండే చదువుకోవడం అనేది సురక్షితమైన ఎంపిక. పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం.