Modi Warns Congress: హనుమాన్ తో పెట్టుకోవద్దు.. కాంగ్రెస్ పై మోడీ ఫైర్!
భజరంగ్దళ్పై నిషేధం విధిస్తానని ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.
- By Balu J Published Date - 05:33 PM, Tue - 2 May 23

కాంగ్రెస్ (Congress) తన ఎన్నికల మేనిఫెస్టోలో భజరంగ్దళ్పై నిషేధం విధిస్తానని ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. హనుమంతుడిని ఆరాధించే వారిని లాక్కోవడానికి పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ గతంలో రాముడిని లాక్కెళ్లిందని, ఇప్పుడు భజరంగ్ బలి’ (హనుమాన్కు జయంతి) అని నినాదాలు చేసేవారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందని మోడీ (PM Modi) మండిపడ్డారు.
మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్పై మోదీ దాడికి దిగారు. ‘‘చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవని. మైనారిటీ వర్గాల మధ్య ద్వేషాన్ని ప్రోత్సహించే వ్యక్తులు, బజరంగ్ దళ్ లాంటి సంస్థలను నిషేధిస్తాం’’ అని కాంగ్రెస్ పేర్కొంది. మంగళవారం విజయనగరం జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ కాంగ్రెస్ నుద్దేశించి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. “హనుమంతుని (Hanuman) పూజలు చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం, కానీ నేను హనుమంతుని గౌరవం ఇవ్వడానికి వచ్చినప్పుడు, అదే సమయంలో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో హనుమంతుడిని లాక్కెళ్లాలని ప్రయత్నించడం సరైంది కాదని మండిపడ్డారు.
‘మొదట రాముడిని లాక్కెళ్లిన వారు (కాంగ్రెస్) ఇప్పుడు ‘జై భజరంగ్’ అని నినాదాలు చేసే కార్యకర్తలను లాక్కుంటారని మోడీ అన్నారు. రాముడితో కాంగ్రెస్ కు సమస్య వచ్చిందని, ఇప్పుడు జై భజరంగ్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం దురదృష్టమని అన్నారు. కర్నాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. “హనుమంతుని పాదాలకు శిరస్సు వంచి ఈ ప్రతిజ్ఞ నెరవేరాలని ప్రార్థిస్తున్నా. కర్ణాటక గౌరవాన్ని, సంస్కృతిని దెబ్బతీయడానికి బీజేపీ (BJP) ఎవ్వరినీ అనుమతించదు’ అని మోదీ ప్రతిజ్ఞ చేశారు. విజయనగర సామ్రాజ్యం, దాని చరిత్ర భారతదేశానికి గర్వకారణమని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తన వనరులతో ఈ ప్రాంతాన్ని చిరస్థాయిగా నిలబెట్టారని విజయనగర సామ్రాజ్యపు మహిమాన్విత పాలకుడి పేరును ప్రస్తావిస్తూ మోడీ అన్నారు.
Also Read: Samantha Ice Bath: సమంత ఐస్ బాతింగ్.. టార్చర్ చేస్తున్నారంటూ కామెంట్!