BJP: మధ్యప్రదేశ్లో 39 మంది, ఛత్తీస్గఢ్లో 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ
ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP) గురువారం (ఆగస్టు 17) ప్రకటించింది.
- By Gopichand Published Date - 05:24 PM, Thu - 17 August 23
BJP: ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP) గురువారం (ఆగస్టు 17) ప్రకటించింది. తొలి జాబితాలో మధ్యప్రదేశ్లోని 230 స్థానాలకు గాను 39 మంది అభ్యర్థులకు బీజేపీ స్థానం కల్పించింది. ఇందులో ఐదుగురు మహిళల పేర్లు ఉన్నాయి. మరోవైపు ఛత్తీస్గఢ్ ఎన్నికల కోసం విడుదల చేసిన తొలి జాబితాలో ఐదుగురు మహిళలు సహా 21 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. పటాన్ నుంచి ఎంపీ విజయ్ బఘెల్ను రంగంలోకి దింపారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. జబల్పూర్ తూర్పు నుంచి అంచల్ సోంకర్, ఝబువా నుంచి భాను భూరియా, మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ నుంచి లలితా యాదవ్లను బీజేపీ నామినేట్ చేసింది.
మధ్యప్రదేశ్లో ఎవరికి టికెట్ వచ్చింది?
సబల్గఢ్ నుంచి సరళా విజేందర్ రావత్, సుమావలి నుంచి అటల్ సింగ్ కంసనా, గోహద్ నుంచి లాల్ సింగ్ ఆర్య, పిచోర్ నుంచి ప్రీతమ్ లోధి, చచోడ్ నుంచి ప్రియాంక మీనా బరిలోకి దిగారు. చందేరీ నుంచి జగన్నాథ్ సింగ్ రఘువంశీ, బండా నుంచి వీరేంద్ర సింగ్ లంబార్దార్, మహారాజ్పూర్ నుంచి కామాఖ్య ప్రతాప్ సింగ్, ఛత్తర్పూర్ నుంచి లలితా యాదవ్, పఠారియా నుంచి లఖన్ పటేల్లకు టిక్కెట్లు ఇచ్చారు. ఇది కాకుండా గున్నౌర్ నుండి రాజేష్ కుమార్ వర్మ, చిత్రకూట్ నుండి సురేంద్ర సింగ్ గహర్వార్, పుష్పరాజ్గఢ్ నుండి హీరాసింగ్ శ్యామ్, బైవారా నుండి ధీరేంద్ర సింగ్, బార్గి నుండి నీరజ్ థాకుక్, జబల్పూర్ తూర్పు నుండి అంచల్ సోంకర్లను బిజెపి నామినేట్ చేసింది.
Also Read: Delhi Assembly: ఢిల్లీలో మణిపూర్ పై చర్చ ఎందుకు? దద్దరిల్లిన ఢిల్లీ అసెంబ్లీ
షాపురా నుంచి ఓంప్రకాష్ ధుర్వే, బిచియా నుంచి విజయ్ ఆనంద్ మరాఠీ, బైహార్ నుంచి భగత్ సింగ్ నేతమ్, లంజీ నుంచి రాజ్కుమార్ కర్రే, బర్ఘాట్ నుంచి కమల్ మాస్కోలే, గోటెగావ్ నుంచి మహేంద్ర నగేశ్, సౌసర్ నుంచి నానాభౌ మొహొద్, పాంధుర్నా నుంచి ప్రకాశ్ ఉకేలను బీజేపీ బరిలోకి దించింది. ఛత్తీస్గఢ్లోని 21 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
Related News
Lok Poll : లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 12 స్థానాల్లో విజయం సాదించబోతుంది – ఈటెల
కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని..కానీ వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత మూటకట్టుకుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు