Police Officer: కోచీలో తన వాకింగ్ కోసం రోడ్డునే బ్లాక్ చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
జనం ఎలా పోతే వారికేంటి.. సార్లు మాత్రం వాకింగ్, జాగింగ్ చేసుకోవడానికి అస్సలు డిస్టబెన్స్ ఉండకూడదు.
- By Hashtag U Published Date - 08:16 PM, Sat - 18 June 22
![Police Officer: కోచీలో తన వాకింగ్ కోసం రోడ్డునే బ్లాక్ చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/06/roadblock.jpg)
జనం ఎలా పోతే వారికేంటి.. సార్లు మాత్రం వాకింగ్, జాగింగ్ చేసుకోవడానికి అస్సలు డిస్టబెన్స్ ఉండకూడదు. అందుకే వాళ్లు అలా చేసే ప్రాంతమంతా ఖాళీ చేయిస్తారు. అవసరమైతే రోడ్లు, స్టేడియంలు అన్నీ బ్లాక్ చేసేస్తారు. ఆమధ్య ఐఏఎస్ దంపతులు తమ శునకంతో వాకింగ్ చేయడం కోసం.. ఢిల్లీలో ఓ మైదానాన్నే ఖాళీ చేయించారు. ఇప్పుడు కేరళలోని ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాకింగ్ కోసం.. రోడ్డును మూసేస్తున్నారు.
కోచిలోని క్వీన్ వాక్ వే అంటే తెలియనివారు ఉండరు. ఎందుకంటే అక్కడ రోజూ వాకింగ్, జాగింగ్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. ఈ వాక్ వే పక్కనే రోడ్డు ఉంటుంది. ఇక ఆదివారాల్లో అయితే పిల్లలు.. సైక్లింగ్, స్కేటింగ్ చేసుకోవడం కోసం.. ఈ రోడ్డును కొద్దిసేపు మూసేస్తారు కూడా. అలా వారానికి కొద్ది సేపు అయితే ఓకే.. కానీ ఈమధ్య కొన్నిరోజులుగా ఈ రోడ్డు రోజూ కాసేపు మూసే ఉంటోందంటున్నారు స్థానికులు. దానికి కారణం తెలిసి పోలీసు అధికారులే ఆశ్చర్యపోయారు.
వినోద్ పిళ్లై.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్. ఈ సార్ కి మార్నింగ్ వాకింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే రోజూ ఉదయం పూట కనీసం రెండుమూడు గంటలైనా సరే.. క్వీన్ వాక్ వేను మూసేస్తారు. ఎందుకంటే అంటే.. ఆ మార్గంలో ఆయనకు వాకింగ్ చేస్తారు. అందుకే వాహనాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డును బ్లాక్ చేసేవారు. ట్రాఫిక్ ను మళ్లించేవారు.
వినోద్ పిళ్లై వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో వాళ్లు ఎంక్వయిరీ చేశారు. అది నిజమే అని తేలడంతో నోటీసులు ఇచ్చారు.
Related News
![Cancer Drugs: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన కేరళ..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/08/medicine-ImResizer.jpg)
Cancer Drugs: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన కేరళ..!
Cancer Drugs: కేరళ.. క్యాన్సర్ బాధితులకు పెద్ద ఉపశమనం. జీరో ప్రాఫిట్తో రాష్ట్ర ప్రభుత్వం ‘కారుణ్య కమ్యూనిటీ ఫార్మసీ’ ద్వారా ఖరీదైన క్యాన్సర్ మందులను (Cancer Drugs) తక్కువ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది. అవయవ మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత వాడే మందులతోపాటు 800 రకాల మందులను లాభదాయకంగా ‘కారుణ్య ఔట్లెట్స్’లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్