Six-Seater Bike: ఈ ‘బుల్లి బైక్’ కు ఆనంద్ మహీంద్రా ఫిదా!
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా పోస్టులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది.
- By Balu J Published Date - 05:46 PM, Fri - 2 December 22
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా పోస్టులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. క్రియేటివిటీ వీడియోలు, ఆసక్తికరమైన విషయాలను ప్రజలకు తెలియజేస్తుండటం ఇందుకు కారణం. అందుకే ఆయనను ఫాలో అవుతున్న నెటిజన్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ షేర్ చేసిన ఈ పోస్టు అందర్నీ ఆకర్షిస్తోంది.
గ్రామీణ యువకుడు మల్టీ రైడర్ సైకిల్ ఇ-రిక్షాను తయారుచేసి ఆశ్చర్యపర్చాడు. ఇది సిక్స్-సీటర్ వాహనం. విద్యుత్ తో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీల వరకు ప్రయాణించవచ్చు. ఈ వాహనాన్ని తయారుచేసేందుకు మొత్తం రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి 10 రూపాయలు తీసుకుంటూ, వాహనాన్ని గ్రామంలో నడిస్తున్నాడు.
“కేవలం చిన్న డిజైన్ ఇన్పుట్లతో ఈ వెహికల్ అద్భుతంగా ఉంది. రద్దీగా ఉండే యూరోపియన్ పర్యాటక కేంద్రాల్లో టూర్ ‘బస్సు’లా ఉంది. నేను ఎల్లప్పుడూ గ్రామీణ రవాణా ఆవిష్కరణలకు ఆకర్షితుడ్ని అవుతాను” అని అన్నాడు 67 ఏళ్ల వ్యాపార దిగ్గజం. ప్రస్తుతం ఈ వీడియో 781k వ్యూస్ తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
With just small design inputs, (cylindrical sections for the chassis @BosePratap ?) this device could find global application. As a tour ‘bus’ in crowded European tourist centres? I’m always impressed by rural transport innovations, where necessity is the mother of invention. pic.twitter.com/yoibxXa8mx
— anand mahindra (@anandmahindra) December 1, 2022
Related News
BRS Party: కార్యకర్తల అక్రమ కేసుల పై డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
BRS Party: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాల్నిప్రోత్సహిస్తోందని ఘాటుగా స్పందించింది. ‘‘ ప్రభుత్వ విధానాలను, పనితీరు ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతోంది. ముఖ్యంగా ప్ర�