Mysterious Crater: గుజరాత్లోని ఈ రహస్య ప్రదేశం గురించి తెలుసా..?
కచ్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ లూనా క్రేటర్ (Mysterious Crater) అని పిలువబడే ఒక రహస్య ప్రదేశం ఉంది. 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ బిలం ఎలా వచ్చిందనే దానిపై ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి.
- By Gopichand Published Date - 06:25 AM, Sun - 31 March 24

Mysterious Crater: కచ్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ లూనా క్రేటర్ (Mysterious Crater) అని పిలువబడే ఒక రహస్య ప్రదేశం ఉంది. 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ బిలం ఎలా వచ్చిందనే దానిపై ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజా పరిశోధన దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఉల్క ఢీకొనడం వల్ల ఈ లూనా బిలం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శాస్త్రవేత్తల ప్రకారం.. ఉల్క కారణంగా లూనా క్రేటర్ ఏర్పడిన అవకాశం బలపడింది. ఈ ఉల్క గత 50,000 సంవత్సరాలలో భూమిని ఢీకొన్న అతిపెద్ద ఉల్కగా చెప్పబడింది. పరిశోధన ప్రకారం.. తాకిడి అడవి మంటలు, షాక్వేవ్లకు దారితీసింది. సింధు లోయ నాగరికత ప్రజలు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నివసించేవారు. ఈ తాకిడి ప్రభావం కచ్చితంగా అణు బాంబుతో సమానంగా ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Also Read: LSG vs PBKS: లక్నో కు తొలి విజయం… చేజింగ్ లో ఓడిన పంజాబ్ కింగ్స్
లూనా క్రేటర్పై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. అయితే దాని ఏర్పాటుకు సంబంధించి నిర్దిష్ట సమాచారం వెల్లడి కాలేదు. తాజాగా కేరళ యూనివర్సిటీకి చెందిన కేఎస్ సజిన్ కుమార్ తన సహచరులతో కలిసి దీనిపై పరిశోధనలు ప్రారంభించారు. ఇక్కడి మట్టిలో ఇరిడియం ఎక్కువ మోతాదులో లభించింది. కొట్టిన ఉల్క ఇనుము అయి ఉండవచ్చని ఇది సూచించింది. చాలా మంది శాస్త్రవేత్తలు దీనిని సమర్థించారు. అయితే దీనిని పూర్తిగా రుజువు చేసేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని కొందరు అభిప్రాయపడ్డారు.
We’re now on WhatsApp : Click to Join