Big Alert: వేస్ట్ పేపర్ లో ప్యాక్ చేసిన ఫుడ్ ను తింటున్నారా.. అయితే బీ అలర్ట్
ఉడకబెట్టిన పల్లీలు, వేడివేడీ బజ్జీలు, పాప్ కార్న్.. ఇలా ఏదైనా సరే తినేందుకు ఇష్టం చూపుతుంటారు.
- Author : Balu J
Date : 28-09-2023 - 4:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ రోజుల్లో చాలామంది బయటి పుడ్ తినడం అలవాటు. ఉడకబెట్టిన పల్లీలు, వేడివేడీ బజ్జీలు, పాప్ కార్న్.. ఇలా ఏదైనా సరే తినేందుకు ఇష్టం చూపుతుంటారు. అయితే ఇష్టమైనవి తినడంలో తప్పు లేదు కానీ వేస్ట్ పేపర్ లో ప్యాక్ చేసి ఇచ్చిన వాటిలో తినడం ముమ్మాటికీ తప్పే. ఇదే విషయమై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
ఆహార విక్రేతలు ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడానికి, వడ్డించడానికి, నిల్వ చేయడానికి వార్తాపత్రికలను ఉపయోగించడం మానేయాలని కోరింది. వార్తాపత్రికల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ FSSAI ఆందోళన వ్యక్తం చేసింది. ఫుడ్ పంపిణీ సమయంలో వార్తాపత్రికలు తరచుగా వివిధ పర్యావరణ పరిస్థితులకు లోనవుతాయని తెలిపింది.
వాటిని ఆహారంలోకి మార్చే బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఇతర రోగకారక క్రిముల ద్వారా కలుషితమయ్యే అవకాశం ఉందని, ఆహారం తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్యాలు, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వార్తాపత్రికలలో ఉపయోగించే సిరా ప్రతికూల ఆరోగ్య ప్రభావాలతో కూడిన అనేక బయోయాక్టివ్ పదార్థాలను కలిగి ఉందని పేర్కొంటూ, FSSAI ప్రింటింగ్ ఇంక్లలో సీసం మరియు భారీ లోహాలతో సహా రసాయనాలు ఉండవచ్చు, ఇవి ఆహారంలోకి వెళ్లి కాలక్రమేణా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని సూచించింది.
Also Read: Sai Pallavi: రెమ్యూనరేషన్ పెంచేసిన సాయిపల్లవి, NC23కి ఎంత తీసుకుంటుందో తెలుసా!