HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Woman Two Children Killed In Fire Accident At Rtps Staff Quarters In Raichur

Raichur: రాయచూరులో విషాద ఘటన.. తల్లీ, పిల్లల సజీవదహనం

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు (Raichur)లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా శక్తినగర్‌లో సోమవారం సాయంత్రం ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు అయ్యారు.

  • By Gopichand Published Date - 08:41 AM, Tue - 7 March 23
  • daily-hunt
Raichur
Resizeimagesize (1280 X 720) (2) 11zon

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు (Raichur)లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా శక్తినగర్‌లో సోమవారం సాయంత్రం ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు అయ్యారు. మృతులను రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్‌టీపీఎస్)లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సిద్దలింగయ్య స్వామి భార్య రంజిత (33), ఆమె పిల్లలు 13 ఏళ్ల మృదుల, ఆరేళ్ల తారుణ్యగా గుర్తించారు. శక్తినగర్‌లోని డీఏవీ స్కూల్‌లో మృదుల 6వ తరగతి, తారుణ్య అదే పాఠశాలలో యూకేజీ చదువుతున్నారు.

రాయచూర్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. కుటుంబం నివసిస్తున్న ఆర్‌టిపిఎస్ ఉద్యోగుల క్వార్టర్‌లోని ఎయిర్ కండీషనర్ పనితీరులో కొన్ని సమస్యలు ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు మొత్తం నివాసానికి వ్యాపించడంతో ప్రాణనష్టం జరిగింది. ఈ కుటుంబం దక్షిణ కర్ణాటకలోని మాండ్య జిల్లా మలవల్లి తాలూకాలోని దళవోయ్కోడిహళ్లి గ్రామానికి చెందిన వారు అని అధికారులు తెలిపారు.

Also Read: Indonesia: ఇండోనేషియాలో విరిగిపడిన కొండచరియలు.. 11 మంది మృతి

సిద్దలింగయ్య స్వామి ఆర్టీపీఎస్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అగ్ని ప్రమాదంలో అతని భార్య, ఇద్దరు పిల్లలు మరణించారు. మేము సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, కొన్ని సమస్యలతో ఉన్న ఇంట్లోని ఎయిర్ కండీషనర్‌కు మంటలు అంటుకున్నాయి మంటలు ఇంటి మొత్తానికి వ్యాపించాయి. ఇంట్లో ఉన్న ముగ్గురు మరణించారు. ఇరుగుపొరుగు వారు సహాయం కోసం అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో ఉన్న ముగ్గురు చనిపోయారు. సంఘటన జరిగినప్పుడు సిద్దలింగయ్య స్వామి ఇంట్లో లేరు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం అని రాయచూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నిఖిల్‌ తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 dead
  • Fire Accident
  • karnataka
  • Raichur

Related News

    Latest News

    • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

    • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd