Tunnel Collapses: దీపావళి రోజున ఘోర ప్రమాదం.. ఉత్తరాఖండ్లో కూలిపోయిన సొరంగం, 35 మంది కూలీల కోసం సహాయక చర్యలు..!
నిర్మాణ పనుల్లో సొరంగం కూలిపోవడం (Tunnel Collapses)తో పదుల సంఖ్యలో కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకుపోయారు.
- By Gopichand Published Date - 12:37 PM, Sun - 12 November 23
Tunnel Collapses: దీపావళి రోజున ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల్లో సొరంగం కూలిపోవడం (Tunnel Collapses)తో పదుల సంఖ్యలో కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకుపోయారు. నివేదిక ప్రకారం.. ఈ సొరంగం యమునోత్రి జాతీయ రహదారి ప్రాజెక్ట్ కింద నిర్మించబడింది. గతంలో ఉత్తరాఖండ్లోని చమోలీలో కూడా ఇదే తరహాలో కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు.
ఉత్తరకాశీలోని సిల్క్యార్ పోల్ గ్రామం బార్కోట్లో కొత్తగా నిర్మించిన సొరంగంలో 30 నుండి 35 మంది వ్యక్తులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అన్ని రెస్క్యూ టీమ్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. వీలైనంత త్వరగా సొరంగం తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాచారం ప్రకారం.. ఉదయం పని చేస్తున్నప్పుడు సొరంగం కూలిపోవడం ప్రారంభించింది. సొరంగం కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న 30 నుంచి 35 మంది కూలీలు, ఇతర ఉద్యోగులు అందులో చిక్కుకుపోయారు.
#WATCH | Uttarakhand: A part of the tunnel under construction from Silkyara to Dandalgaon in Uttarkashi, collapsed. DM and SP of Uttarkashi district are present at the spot. SDRF, and Police Revenue teams are also present at the spot for relief work. Rescue operations underway. pic.twitter.com/hxrGqxWrsO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 12, 2023
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అందరూ క్షేమంగా ఉన్నారని, అయితే వీలైనంత త్వరగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం SDRF, NDRF జాతీయ విపత్తు నిర్వహణ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వారు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. వీలైనంత త్వరగా టన్నెల్ను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
Also Read: Anti Pollution Diet: కలుషితమైన గాలి నుండి మిమల్ని రక్షించే ఆహార పదార్థాలు ఇవే..!
ఈ ఘటన తెల్లవారుజామున 5:30 గంటలకు జరిగినట్లు సమాచారం. అయితే ఆలస్యంగా సమాచారం అందింది. ప్రస్తుతం సొరంగంలో చిక్కుకున్న ఉద్యోగులు, కూలీల సంఖ్య 30 నుంచి 35 వరకు ఉండవచ్చు. ప్రస్తుతం ఈ కూలీలకు పైపుల సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. సొరంగం తెరవడానికి 800 మీటర్ల లోపల కార్మికులు చిక్కుకున్నారని, 200 మీటర్ల మేర శిథిలాలు వచ్చి చేరాయని చెబుతున్నారు. ప్రజలను రక్షించేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే నిరంతరాయంగా శిథిలాలు వస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ సమస్యలను ఎదుర్కొంటోంది.
గతంలో కూడా టన్నెల్ ప్రమాదం జరిగింది
ఇంతకు ముందు కూడా ఉత్తరాఖండ్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఇందులో సొరంగంలో చిక్కుకుని 20 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ప్రమాదం ఘోరంగా ఉందని అయితే ప్రజలందరినీ సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
Related News
Benefits Of MPs: దేశంలో ఎంపీలకు విలాసవంతమైన సౌకర్యాలు, అలవెన్సులు
ఎంపీగా గెలిస్తే ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎంపీలు నెలవారీ జీతం రూ. 1 లక్ష, అలవెన్సులు సహా. వారి పదవీకాలం తర్వాత పెన్షన్ రూ. 50,000.