HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Top News Today January 30 2024

Top News Today: దేశవ్యాప్తంగా జరిగిన నేటి ముఖ్యంశాలు

రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 30-01-2024 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Top News Today
Top News Today

Top News Today: రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.

మనుషుల మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో మరో కీలక ముందుడుగు పడింది.తొలిసారి ఓ వ్యక్తి మెదడుకు విజయవంతంగా వైర్‌లెస్ చిప్‌ను అమర్చామని, ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నాడని.ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు.

తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు హైదరాబాద్​లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.ఇందులో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేఏ పాల్ కలిశారు.

ఏపీలో భారీగా ఐపీఎస్‌బదిలీ అయ్యారు.ఎన్నికల నేపథ్యంలో 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తే రాజ్యసభ సీటు ఇవ్వాలని అధికార కాంగ్రెస్ భావిస్తుంది. తెలంగాణలో ఖాళీ కాబోతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది.

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఝాన్సీ జుట్టు లాగిన కానిస్టేబుల్‌ అయేషాను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీచేశారు.

డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. స్వాతి పత్రికలో వచ్చిన కథను కాపీ చేసి శ్రీమంతుడిని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే.

కోహ్లీ నాపై ఉమ్మేశాడు వేశాడంటూ సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి 2015లో భార‌త గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లో కోహ్లీ డీన్ ఎల్గ‌ర్ పై ఉమ్మి వేశాడట. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో డీన్ విషయన్నీ వెల్లడించాడు.

గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 100 పెరిగి 57,800కి చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల గోల్డ్ పై 100 పెరిగి 63,050 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండిపై .200 పెరిగింది. దీంతో కిలో వెండి 77,700 గా నమోదైంది.

Also Read: PM Modi: దేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికవ్వడం ఖాయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • abvp
  • gold price
  • January 30
  • kohli
  • pm modi
  • Top News Today

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd