HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Today Top News Headlines January 292024

Top News Today: టుడే టాప్ న్యూస్ తెలుగు

మాల్దీవుల పార్లమెంట్‌లో సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధికార కూటమి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, మాల్దీవుల ప్రగతిశీలక పార్టీ ఎంపిలు, ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ ఎంపిలు హాల్ లోనే కొట్టుకున్నారు.

  • By Praveen Aluthuru Published Date - 11:05 AM, Mon - 29 January 24
  • daily-hunt
Top Today News
Top Today News

Top News Today: మాల్దీవుల పార్లమెంట్‌లో సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధికార కూటమి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, మాల్దీవుల ప్రగతిశీలక పార్టీ ఎంపిలు, ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ ఎంపిలు హాల్ లోనే కొట్టుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రకాష్ గౌడ్ తాజాగా స్పందించి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

వరంగల్‌లో ఓ గ్యాస్‌ వినియోగదారుడికి వింత అనుభవం ఎదురైంది. గ్యాస్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ బదులు నీరు వస్తుందని లబోదిబోమన్నాడు.వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో బాధితుడు ఆకుల సత్యం ఫిర్యాదు మేరకు అధికారులు విచారిస్తున్నారు.

బీహార్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరపడింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పారు. ఆపై ఎన్డీయే కూటమితో జతకట్టి తొమ్మిదో సారి సీఎంగా ప్రమాణం చేశాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై వస్తున్న కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు

ఏపీలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అంతకుముందు ఎల్లుండి ఏపీ క్యాబినెట్‌ భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం ఓటర్లకు భారీగా తాయిలాలు ప్రకటిస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది.

అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రామ మందిరానికి సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. అందుకనుగుణంగా ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కొనుగోలు చేశారు.

తెలంగాణలో త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జనసేనతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేసి పది సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ధీమా వ్యక్తంచేశారు.

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకొన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

గుంటూరు కారం మూవీ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ సుదర్శన్ థియేటర్లో అత్యంత వేగంగా కోటి గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఇంగ్లండ్‍తో తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన తర్వాత అనూహ్యంగా భారత్ ఓడిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ చారిత్రాత్మక విజయం సాధించింది.27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై విండీస్ జట్టు టెస్టు మ్యాచ్ గెలిచింది.

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. రెండ్రోజులుగా పెరిగిన బంగారం ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700 కాగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,950 వ‌ద్ద కొన‌సాగుతోంది. అటు వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 77,500 గా నమోదైంది.

Also Read: Ayodhya : భారీ భూకంపం వచ్చిన అయోధ్య రామమందిరానికి ఏమీకాదు..ఎందుకంటే ..!!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AUS vs WI
  • Headlines
  • IND vs ENG
  • january 29
  • nitish kumar
  • Top News

Related News

Team India Schedule

Team India Schedule: ఫుల్ బిజీగా టీమిండియా.. క్రికెట్ షెడ్యూల్ ఇదే!

టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 నుండి మొదలవుతుంది. ఈ సిరీస్‌లో లార్డ్స్ (Lord's) వంటి చారిత్రక మైదానంలో జరిగే మ్యాచ్ ముఖ్య ఆకర్షణ కానుంది.

  • 5 Star Hotel

    5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

Latest News

  • TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

  • Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

  • Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

  • Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

  • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd