Joshimath: ఆ ఊర్లో ఇళ్లు, రోడ్లకు బీటలు.. అంతుచిక్కని రహస్యం.. పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు?
ఉత్తరాఖండ్లో జోషిమత్ అనే ఊరు కుంగిపోతుంది. ఇళ్లకు పగుళ్లు వచ్చి బీటలు వాలుతున్నాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకున్నారు. ఏదాది కాలంగా గ్రామ ప్రజలు పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు.
- By Nakshatra Published Date - 06:32 PM, Thu - 5 January 23
Joshimath: ఉత్తరాఖండ్లో జోషిమత్ అనే ఊరు కుంగిపోతుంది. ఇళ్లకు పగుళ్లు వచ్చి బీటలు వాలుతున్నాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకున్నారు. ఏదాది కాలంగా గ్రామ ప్రజలు పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే 60కిపైగా కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇంకా 500 కుటుంబాలు భయంతో అక్కడే బ్రతుకుతున్నాయి. దిక్కు,మోక్కు లేక అక్కడే జీవనం జీవిస్తున్నారు. దాదాపు మూడు వేల కుటుంబాలు ఇక్కడ జీవినం కొనసాగిస్తున్నాయి. ఇళ్లతో పాటు రోడ్లకు కూడా పగుళ్లు వస్తున్నాయి. పగుళ్లు రావడానికి కారణాలు ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇది భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతమని, అందుకే ఇలా జరుగుతుందని కొంతమంది అంటున్నారు. ఇక భూగర్భంలో జలప్రవాహం నేపథ్యంలో ఇలా జరుగుతుందని మరికొందరు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతానికి ప్రాచీన చరితర్ ఉంది. పవిత్రమైన స్థలంగా దీనిని చెబుతారు. ఆది శంకరాచార్య నలు దిక్కుల నెలకొల్పిన పీఠాల్లో ఒకటి జోషిమత్ ఇక్కడ ఉంది. అలాగే కేదార్ టెంపుల్, నార్సింగ్ ఆలయం, గారి భవాని ఆలయం లాంటి ఇక్కడే ఉన్నాయి. తాజాగా ఇక్కడి ప్రజలు కాగడాల ప్రదర్శన నిర్వహించి తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. త్వరలోనే గ్రామాన్ని సందర్శిస్తానని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సందర్శించనున్నారు. ఐఐటీ రూర్కీ టీమ్ ఈ గ్రామంలోని ఎందుకు అలా భూమికి పగుళ్లు వస్తున్నాయనే విషయంపై నివేదిక తయారుచేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని పుష్కర్ సింగ్ ధామి భావిస్తున్నారు. ఈ గ్రామంలో ఎందుకు అలా జరుగుతుందో కనుక్కుని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే తాను పర్యటించనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
Tags
Related News
Climate Change Impact: వాతావరణ మార్పు ప్రభావంతో కరిగిపోతున్న వెనిజులా మంచు పర్వతాలు
వెనిజులా తన చివరి హిమానీనదాన్ని కోల్పోయింది. ఆ దేశంలోని అండీస్లోని సియెర్రా నెవాడా డి మెరిడా పర్వతాలలో కనిపించే హంబోల్ట్ గ్లేసియర్ చిన్నదిగా మారింది. వాతావరణ మార్పుల ప్రభావం దీనికి కారణమని చెబుతున్నారు. హంబోల్ట్ గ్లేసియర్ని 'లా కరోనా' అని కూడా అంటారు.