PM Modi: ఆయుష్మాన్ కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలు, మోడీ హర్షం
- By Balu J Published Date - 11:25 AM, Tue - 26 December 23
PM Modi: దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలకు చేరడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రల్లో అర్హులైన కోటి మందికి పైగా లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేయడాన్ని ఆయన కొనియాడారు. కాగా ఆయుష్మాన్ భారత్ కార్డులు మహారాష్ట్రలోనే ఎక్కువగా పంపిణీ చేశారు.
ఈ రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఈ కార్డులు పొందారు. ప్రస్తుతం పెరిగిపోయిన వైద్య ఖర్చుల నేపథ్యంలో సాధారణ, మధ్యతరగతి ప్రజలకు 5 లక్షల రూపాయల విలువైన వైద్యాన్ని ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా ఉచితంగా చేరువ చేస్తున్న విషయం తెలిసిందే. భారతదేశం మొత్తం జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ఆర్థిక కొరత కారణంగా సరైన చికిత్సకు నోచుకోవడం లేదు.
PMJAY వారికి సరైన ఆరోగ్య సేవలను పొందడంలో సహాయం చేయడం, వైద్య ఖర్చులను నివారించడం, చివరికి మధ్యతరగతి జనాభా పేదరికాన్ని నివారించడంలో సహాయం చేయడంలక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద లబ్ధిదారుని కుటుంబం సంవత్సరానికి రూ.5 లక్షల ప్రయోజన కవరేజీని పొందుతారు. ఈ పథకం గది ఛార్జీలు, డాక్టర్ ఫీజులు, రోగనిర్ధారణ సేవలు, చికిత్స ఖర్చు, ఐసియు మరియు ఆపరేషన్ థియేటర్ ఖర్చులు మొదలైన వాటితో సహా దాదాపు 1393 విధానాలకు కవరేజీని అందిస్తుంది.
లబ్ధిదారుడు భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య సదుపాయాల కోసం క్లయిమ్ చేయవచ్చు.
Tags
Related News
Maldives : దౌత్య పరమైన విభేదాలు..భారత పర్యటనకు రానున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి
India and Maldives: భారత్ , మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే “మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మే 9న అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాల్దీవుల విదేశాంగ మంత్రి మూస�