Swati Maliwal : అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మలివాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
- By Pasha Published Date - 03:12 PM, Sun - 26 May 24
![Swati Maliwal : అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మలివాల్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Swati-Maliwal-1.jpg)
Swati Maliwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంప్లయింట్ను వెనక్కి తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం తనను బెదిరిస్తోందని స్వాతి మలివాల్ ఆదివారం ఆరోపించారు. ఆప్ నాయకులు తన క్యారెక్టర్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె చెప్పారు.
After the leaders and volunteers of my party i.e. AAP orchestrated a campaign of charachter assassination, victim shaming and fanning of emotions against me, I have been getting rape and death threats.
This got further exacerbated when YouTuber @Dhruv_Rathee posted a one-sided… pic.twitter.com/EfCHHWW0xu
— Swati Maliwal (@SwatiJaiHind) May 26, 2024
We’re now on WhatsApp. Click to Join
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తనకు వ్యతిరేకంగా ఏకపక్ష వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారని స్వాతి మలివాల్ (Swati Maliwal) మండిపడ్డారు. తన అభిప్రాయాన్ని చెప్పాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. మెసేజ్లు పెట్టినా ధ్రువ్ రాఠీ స్పందించడం లేదన్నారు. ధ్రువ్ రాఠీ తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అసత్య ఆరోపణలు చేయడాన్ని ఆపాలని ధ్రువ్ రాఠీకి స్వాతి మలివాల్ హితవు పలికారు. ‘‘స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకునే ధ్రువ్ రాఠీ లాంటి వాళ్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధుల్లా ప్రవర్తిస్తున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘యూట్యూబర్ ధృవ్ రాఠీని ఆప్ ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నాడు.. దాడి కేసులో బాధితురాలినైనా నన్ను అవమానించాడు. రాఠీ 2.5 నిమిషాల యూట్యూబ్ వీడియోలో అన్నీ అబద్ధాలే ఉన్నాయి’’ అని స్వాతి మలివాల్ తెలిపారు. ‘‘నాకు వస్తున్న బెదిరింపుల సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు అందించాను. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ ఆమె చెప్పారు.
Also Read : IT Raids : నగల దుకాణంపై ఐటీ రైడ్స్.. రూ.116 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![AAP : స్వాతి మలివాల్ దాడి కేసు..హైకోర్టును ఆశ్రయించిన బిభవ్ కుమార్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Bibhav-Kumar-approached-Hig.jpg)
AAP : స్వాతి మలివాల్ దాడి కేసు..హైకోర్టును ఆశ్రయించిన బిభవ్ కుమార్
Bibhav Kumar: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) వ్యక్తిగత అనుచరుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆప్ ఎంపీ స్వాతిమలివాల్(Swatimaliwal)పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ను మే 18న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బిభవ్ ఈ దాడి కేసులో ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. ఈ దాడి కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. We’re now on WhatsA