Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరం నిర్మాణ పనుల కొత్త అప్డేట్స్
Ayodhya Ram Temple : ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిర నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఒక డేట్ను ఫిక్స్ చేశారు.
- By Pasha Published Date - 11:06 AM, Sat - 16 March 24
ఇప్పటికే అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Temple) గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది. ఆలయం మొదటి అంతస్తు, శిఖరం నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీన్ని మరింత వేగంగా పూర్తి చేయడం కోసం, అదనపు ఉద్యోగులను నియమించి స్తంభాలను చెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 1,400 మంది శిల్పకారులు రాతి స్తంభాలను చెక్కుతున్నారు. వీరికి అదనంగా మరో 200 మందిని నియమించారు. ఆలయం లోపలి భాగంలో 11 దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో మరిన్ని శిల్పాలను కూడా చేయిస్తున్నారు. ఈ పనులన్నీ 2025 మార్చి నాటికి పూర్తి అవుతాయి.
అయోధ్య రామ మందిర దర్శనానికి వచ్చే వారిలో దివ్యాంగులు, పెద్దలు కూడా ఉంటారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలోని బేస్మెంట్ సమీపంలో పశ్చిమ, దక్షిణ ద్వారాల వద్ద లిఫ్టులను నిర్మిస్తున్నారు. వీటి ద్వారా వారు సౌకర్యవంతంగా దైవ దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది.
Related News
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.