Sonia Gandhi On Modi : మోడీ తీరుపై సోనియా సంచలన వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై రాజస్థాన్ ఉదయ్పూర్ లో ప్రారంభమైన మేథోమధన సదస్సులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా విరుచుకుపడ్డారు
- By CS Rao Published Date - 06:00 PM, Fri - 13 May 22
ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై రాజస్థాన్ ఉదయ్పూర్ లో ప్రారంభమైన మేథోమధన సదస్సులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా విరుచుకుపడ్డారు. వాగ్దాటి ప్రధాని కనీస ప్రభుత్వం-గరిష్ట పాలన అంటూ దేశాన్ని శాశ్వత సంక్షోభంలోకి తీసుకెళుతున్నారని మండపడ్డారు. ఇలాంటి సమయంలో పార్టీ మాకేమి ఇచ్చిందని కాదు, పార్టీ కోసం మనం ఏమి చేశామని ఆలోచించాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నాయకులను ఓపెన్ మైండ్తో చర్చించి అభిప్రాయాలను బహిరంగంగా తెలియజేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు సమయం ఆవశ్యకతపై చర్చించాలని సూచించారు. జాతీయ సమస్యలపై చింతన్ మరియు కాంగ్రెస్ భవిష్యత్ పై అర్ధవంతమైన ఆత్మచింతన్ అవసరమని పిలుపునిచ్చారు.
పని తీరు మార్చుకుని అరాచక ఎన్డీయే ప్రభుత్వంపై పోరాడాలని సోనియా దిశానిర్దేశం చేశారు. బలమైన కాంగ్రెస్ పార్టీ ఐక్యత ఉందన్న సందేశం దేశానికి వెళ్లాలని సూచించారు. వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీకి ప్రాధాన్యం ఉండాలని చెప్పారు. పార్టీ మాకు చాలా ఇచ్చింది, తిరిగి చెల్లించాల్సిన సమయం ఇది అనే ఆలోచన చేసే సమయం ఇప్పుడుందని గుర్తు చేశారు. మోడీ సర్కార్ మైనారిటీలను క్రూరంగా చూడడం, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడం “బాధాకరమైన” అన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ప్రారంభమైన “చింతన్ శివిర్” పార్టీలో ఆమె మాట్లాడుతూ “మా వాగ్ధాటి ప్రధానమంత్రిష అవసరమైనప్పుడు మౌనంగా ఉంటారని విమర్శించారు.
“PM నరేంద్ర మోడీ మరియు అతని పార్టీ ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన అర్థం దేశాన్ని శాశ్వత నిద్రాణంలో ఉంచడం, ప్రజలను నిరంతరం భయం, అభద్రత స్థితిలో ఉండేలా బలవంతం చేయడమా అంటూ ప్రశ్నించారు. సమాజంలో అంతర్భాగమైన , గణతంత్ర సమాన పౌరులైన మైనారిటీలను బలిపశువులను చేయడం క్రూరత్వమంటూ సోనియా గాంధీ ఆరోపించారు.
సమాజంలోని పురాతన భిన్నత్వాలను ఉపయోగించి విభజించడం మంచిది కాదన్నారు. ఏకత్వం మరియు భిన్నత్వం గురించి జాగ్రత్తగా పెంపొందించిన ఆలోచనను తారుమారు చేయడం దారుణమన్నారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడం మరియు బెదిరించడం, వారి ప్రతిష్టను దిగజార్చడం, దర్యాప్తు సంస్థలను ఉపయోగించి నాసిరకం సాకులతో జైలుకు పంపడం మోడీ స ర్కార్ చేస్తోన్న దుర్మార్గంగా కాంగ్రెస్ చీఫ్ అభివర్ణించారు.
“మన నాయకులను ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూపై నిరంతరం దిగజారుడు మాటలు, మహాత్మా గాంధీ హంతకులను కీర్తించడం, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే వ్యూహాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వాగ్ధాటి ప్రధాని అత్యంత అవసరమైనప్పుడు మౌనం వహించడమంటే సమాజాన్ని విభజించడం, పురాతన భిన్నత్వంలోని ఐక్యతను బలహీనపరచడమేనని సోనియా అన్నారు.
Related News
Raghurami Reddy : ఖమ్మం లోక్సభ సీటు దక్కించుకున్న రఘురామిరెడ్డి ఎవరు ?
Raghurami Reddy : ఖమ్మం లోక్సభ సీటు ఎవరూ ఊహించని రీతిలో రామసహాయం రఘురాం రెడ్డికి దక్కింది.