HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Shah Asks Bjp Leaders To Ensure Big Win In Ls Polls

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలపై గురిపెట్టిన అమిత్ షా

2024 లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై మోడీ ప్రభుత్వం కన్నేసింది. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు పార్టీ పెద్దఎత్తున విజయం సాధించేలా చూడాలని కోరారు

  • Author : Vamsi Chowdary Korata Date : 24-12-2023 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lok Sabha Elections
Lok Sabha Elections

Lok Sabha Elections: 2024 లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై మోడీ ప్రభుత్వం కన్నేసింది. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు పార్టీ పెద్దఎత్తున విజయం సాధించేలా చూడాలని కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో అమిత్ షా పార్టీ నేతలతో మాట్లాడారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని హైలైట్ చేయాలని, ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సమావేశంలో షా చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శించాలంటే 10 సార్లు ఆలోచించేలా ఉండాలని అమిత్ షా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.మరియు బూత్ స్థాయి కార్యకర్తల ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడారు.

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రార్థనలు, ఇతర మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలని అమిత్ షా కోరారు. జనవరి 1 నుండి, బిజెపి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అక్షత పంపిణీ, దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు మరియు దీపాలు వెలిగించడం వంటి కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పారు.

కొత్త ఓటర్లను ఆకర్షించే వ్యూహంపై కూడా కాషాయం పార్టీ సమావేశంలో చర్చించింది. దీని కోసం బహిరంగ సభలు మరియు సమావేశాలు నిర్వహిస్తామని బీజేపీ పెద్దలు చెప్తున్నారు. కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పేదలు, యువత మరియు రైతులకు మద్దతు ఇవ్వడంపై బీజేపీ దృష్టి సారిస్తుందని, 2024 లోక్‌సభ ఎన్నికల వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ నేతలను ఆదేశించారు.

Also Read: Toilet Showroom : మహిళా ప్రయాణికులకు ‘టాయిలెట్ షోరూమ్’.. ఫీజు కేవలం రూ.10


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • elections
  • lok sabha
  • LS polls
  • pm modi

Related News

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd