BJP’s Mass Joining: బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?
బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?, బీజేపీ రాజకీయ చదరంగంలో ఆ పార్టీకి కష్టాలు తప్పవా? తాజాగా బీజేపీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
- By Praveen Aluthuru Published Date - 09:30 AM, Mon - 19 February 24
BJP’s Mass Joining: బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?, బీజేపీ రాజకీయ చదరంగంలో ఆ పార్టీకి కష్టాలు తప్పవా? తాజాగా బీజేపీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
రేపు ఫిబ్రవరి 20 నుండి కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ , ఆమ్ ఆద్మీ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీల సిట్టింగ్ ఎంపిలు మరియు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే టాపిక్ నడుస్తుంది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ వర్గాలు వెల్లడించాయి. బీజేపీలోకి వివిధ పార్టీల నేతల రాక ప్రక్రియ ఈ నెలాఖరు ఫిబ్రవరి 29 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు, ఇటీవల ఎన్నికైన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
కాంగ్రెస్ నేత కమల్ నాథ్, ఆయన కుమారుడు చింద్వారా ఎంపీ నకుల్ నాథ్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. మరోవిశేషం ఏంటంటే.. నకుల్నాథ్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కాంగ్రెస్ ని ఇప్పటికే తొలగించారు.దీంతో అయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమైంది.
యుపిఎ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఓ కాంగ్రెస్ నాయకుడు బీజేపీ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు బిజెపి సీనియర్ మూలం సూచించింది.బీఎస్పీకి చెందిన లాల్గంజ్ ఎంపీ సంగీతా ఆజాద్, అంబేద్కర్ నగర్ ఎంపీ రితేష్ పాండే బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆజాద్ బీఎస్పీ వ్యవస్థాపక సభ్యుడైన కుటుంబానికి చెందినవాడు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్కు చెందిన అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలోకి ప్రవేశించారు. రాబోయే రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ ఆయనను నామినేట్ చేసింది. పార్టీ మారిన తర్వాత ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మహారాష్ట్రలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్కు ఎలాంటి వ్యూహం లేదని విమర్శించారు.
Also Read: DL1 CJI 0001 : సీజేఐ చంద్రచూడ్ కారు నంబర్ వైరల్.. ఎందుకు ?
Related News
Prajwal Rape Victims: ప్రజ్వల్ అత్యాచార బాధితులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సహాయం
జెడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు బలైన మహిళలకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా.