Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో 144 సెక్షన్.. ఈ పనులు చేయటం నిషేధం..!
2023 స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా ఢిల్లీ పోలీసులు అలర్ట్ మోడ్లో ఉన్నారు. దీంతో పాటు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
- By Gopichand Published Date - 08:52 AM, Fri - 11 August 23
Independence Day: 2023 స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా ఢిల్లీ పోలీసులు అలర్ట్ మోడ్లో ఉన్నారు. దీంతో పాటు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కోవటానికి ఇప్పటికే రాజ్ఘాట్, ITO, ఎర్రకోట చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించబడింది. ఇది మాత్రమే కాదు.. ఢిల్లీ సరిహద్దు ప్రాంతం నుండి ప్రవేశించే వాహనాల తనిఖీ ఆపరేషన్ను కూడా పోలీసులు కఠినతరం చేశారు.
మరోవైపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ట్వీట్ చేస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని, రాజ్ఘాట్, ఐటీఓ, ఎర్రకోట చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయబడింది. అలాగే ఈ ప్రాంతాల్లో గుమికూడేందుకు అనుమతి లేదు. ఈసారి 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటామని, ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Also Read: Not Playing In T20Is: నేను, కోహ్లీ టీ20 క్రికెట్ ఆడకపోవటానికి కారణం అదే: రోహిత్ శర్మ
ఆగస్టు 16 వరకు ఈ పనులపై నిషేధం
అంతకుముందు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల దృష్ట్యా ఆగస్టు 16 వరకు దేశ రాజధాని ఆకాశంలో పారాగ్లైడర్లు, ‘హ్యాంగ్-గ్లైడర్లు’, ‘హాట్ ఎయిర్ బెలూన్లు’ ఎగురవేయడాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పారాగ్లైడర్లు, పారా మోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లు, మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), రిమోట్గా పైలట్ చేసే విమానాలు, హాట్ ఎయిర్ బెలూన్లు, చిన్నపాటి శక్తితో నడిచే విమానాలను నేరస్థులు, సంఘ వ్యతిరేక వ్యక్తులు లేదా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఉపయోగించవచ్చని సమాచారం అందిందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Related News
Lok Sabha Elections 2024: ములుగు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
1.05.2024 సాయంత్రం 4.00 గంటల నుంచి 14.05.2024 సాయంత్రం 4.00 గంటల వరకు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధించారు.