India: మోడీ గారు మీ మౌనానికి అర్థం ఏంటి ?
లఖీంపుర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర సహాయక హోంమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు దూసుకెళ్లడంతో ఆ ఘటనలో 8మంది చనిపోవడం తెలిసిందే.
- By hashtagu Published Date - 04:29 PM, Fri - 17 December 21
లఖీంపుర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర సహాయక హోంమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు దూసుకెళ్లడంతో ఆ ఘటనలో 8మంది చనిపోవడం తెలిసిందే. అయితే ఈ ఘటన పై విచారణ కొరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)ను నియమించింది. తాజాగా సిట్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ జిల్లా కోర్టుకు నివేదిక సమర్పరించారు.లఖీంపుర్ ఖేరీ ఘటన ప్రణాళికా బద్ధంగా చేసిన నేరమేనని కావాలనే ఆశిష్ మిశ్ర కారును రైతుల పైకి ఎక్కించారని మా విచారణలో భాగంగా తేలింది అని పేర్కొంది. కావున కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్ర పై నమోదైన ఐపీసీ సెక్షన్ 279( రాష్ డ్రైవింగ్), సెక్షన్ 338 (హాని కలిగించడం) లకు బదులు సెక్షన్ 326, 307( అట్టెంప్ట్ టు మర్డర్) కింద కేసు నమోదు చేయాలనీ కోర్టును కోరింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను కారుతో తొక్కించి చంపిన కేసులో ఆశిష్ మిశ్ర ప్రథమ ముద్దాయిగా గా ఉన్నాడు. రైతులపైకి ఎక్కించిన కారులో కూడా అయన ఉన్నటు సమాచారం.
పార్లమెంటు లో అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుండి తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేదు. కనీసం లఖీంపుర్ ఖేరీ ఘటన పై చర్చ జరపాలని డిమాండు చేసినా ఫలితం లేకపోయింది. ఆశిష్ మిశ్ర పై వచ్చిన ఆరోపణలకు తన తండ్రి అజయ్ మిశ్ర ను మంత్రి పదవి నుండి తప్పించడం ఏంటి అని అనుకోవచ్చు. ఆశిష్ మిశ్రాకు రైతులకు భూమి తగాదాలు ఆస్తి తగాదాలు లేవు కాగా.. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం లో ఆయన మంత్రిగా ఉన్నారు. కావున ఈ ఘటనను రాజకీయ కోణం లో తప్ప వేరే కోణంలో చూడలేము. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ ఘటన పై, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడి పై రాష్ట్ర హోంశాఖ నిష్పక్షపాతంగా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా విచారణ జరపాలంటే వెంటనే అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుండి తపించాలి. ఇందులో అజయ్ మిశ్ర హస్తం ఏమైనా ఉందా లేదా అని నిర్ధారించే వరకు అజయ్ మిశ్ర ను ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలి. విచారణ లో మంత్రి అజయ్ మిశ్రాకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు అని నిర్ధారణ అయితే తిరిగి మంత్రి మండలిలోకి తీసుకోవ్వలి. ఈ ఘటన పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వహించడం బాధాకరం. మౌనం కూడా ఒక సందేశమే అని ప్రధానమంత్రి గారు మర్చిపోవద్దు. ఇంత జరిగాక కూడా మోడీ మంత్రి మండలిలో అజయ్ మిశ్ర కొనసాగడం పట్ల మోడీ తనని సమర్ధిస్తున్నాడా అనే సందేహం రాక తప్పదు.
Related News
Iyer- Kishan: అయ్యర్, ఇషాన్ కిషన్లకు మరో అవకాశం ఇచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు మరోసారి అవకాశం కల్పించింది.