IndiGo Flight: ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి
రాంచీ నుంచి పూణె వెళ్తున్న ఇండిగో విమానాన్ని (IndiGo Flight)నాగ్పూర్కు మళ్లించారు. ఓ ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
- By Gopichand Published Date - 10:12 AM, Sat - 18 March 23

రాంచీ నుంచి పూణె వెళ్తున్న ఇండిగో విమానాన్ని (IndiGo Flight)నాగ్పూర్కు మళ్లించారు. ఓ ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఒక ప్రయాణికుడి వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా నాగ్పూర్ విమానాశ్రయంలో విమానాన్ని షెడ్యూల్ చేయని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు విమానాన్ని నాగ్పూర్ విమానాశ్రయానికి మళ్లించారు. ప్రయాణికుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు.
సమాచారం ప్రకారం.. ఇండిగో విమానం నంబర్ 6E-672 గురువారం రాత్రి రాంచీ నుండి పూణెకు వెళ్లింది. విమానంలో ప్రయాణిస్తున్న 73 ఏళ్ల ప్రయాణికుడికి అధిక రక్తపోటు కారణంగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ప్రయాణికుడి పరిస్థితిని చూసిన సిబ్బంది పైలట్కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పైలట్ నాగ్పూర్ విమానాశ్రయంలోని ఏటీసీని సంప్రదించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరారు. ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాత్రి 10.12 గంటలకు విమానాన్ని ల్యాండ్ చేశారు. ల్యాండింగ్తో, వృద్ధుడిని కిమ్స్-కింగ్స్వే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Also Read: Third Front: మరో కొత్త ఫ్రంట్.. బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న ఫ్రంట్
ప్రక్రియను పూర్తి చేసేందుకు మృతదేహాన్ని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి పంపినట్లు కిమ్స్-కింగ్స్వే హాస్పిటల్ డిప్యూటీ జనరల్ (కమ్యూనికేషన్స్) ఎజాజ్ షమీ తెలిపారు. రోగి కార్డియాక్ అరెస్ట్తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Related News

Emergency Landing: సముద్రంలో నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
భారత నేవీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధృవ్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజువారీ గస్తీలో ఉన్న ధృవ్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency Landing) చేయాల్సి వచ్చింది.