Protest In Leh: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని లేహ్లో తీవ్ర ఉద్రిక్తత!
లేహ్ అపెక్స్ బాడీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి రాష్ట్ర హోదా, లడఖ్ను ఆరవ షెడ్యూల్లో చేర్చాలనే తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ నాయకులు నిరాహార దీక్షను ముగించరని వారు తెలిపారు.
- Author : Gopichand
Date : 24-09-2025 - 3:24 IST
Published By : Hashtagu Telugu Desk
Protest In Leh: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని లేహ్లో (Protest In Leh) బుధవారం విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. లేహ్లో పూర్తి రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న ఆందోళన ఇప్పుడు భారీ నిరసన ప్రదర్శనగా మారింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. సీఆర్పీఎఫ్ వాహనానికి నిప్పు పెట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మద్దతుగా ఈ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వాంగ్చుక్ నాయకత్వంలో విద్యార్థులు నాలుగు డిమాండ్లను ఉంచారు. ఆ డిమాండ్లు నెరవేర్చకపోవడానికి నిరసనగా, ప్రదర్శనకారులు పోలీసులపై దాడి చేశారు.
లేహ్ అపెక్స్ బాడీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి రాష్ట్ర హోదా, లడఖ్ను ఆరవ షెడ్యూల్లో చేర్చాలనే తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ నాయకులు నిరాహార దీక్షను ముగించరని వారు తెలిపారు.
Also Read: Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం!
లేహ్లో జెన్ జెడ్ (Gen Z) నిరసన
లడఖ్కు పూర్తి రాష్ట్ర హోదా కోసం నిరసనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. అలాగే ఇతర ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. జెన్ జెడ్ చేస్తున్న ఈ నిరసనను అదుపు చేయడానికి పోలీసులు ఒకవైపు టియర్గ్యాస్ షెల్స్, లాఠీఛార్జ్ చేస్తున్నారు. మరోవైపు నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. వాంగ్చుక్ నాయకత్వంలోని లడఖ్ అపెక్స్ బాడీ లడఖ్కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. సోనమ్ వాంగ్చుక్ 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వాంగ్చుక్ మద్దతుదారుల నాలుగు డిమాండ్లు నెరవేరకపోవడంతో ప్రజలు నిరసనలు చేస్తున్నారు.
#KahaniKursiKi | केंद्र सरकार के खिलाफ नारेबाजी कर रहे हैं छात्र #BreakingNews #Leh #StudentsProtest #GENZProtest @journosaurav pic.twitter.com/OcV9tOLDrl
— India TV (@indiatvnews) September 24, 2025
లేహ్లోని నిరసనకారుల నాలుగు డిమాండ్లు
- లడఖ్కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలి.
- లడఖ్లో లోక్సభ స్థానాల సంఖ్యను 2కి పెంచాలి.
- లడఖ్ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో చేర్చాలి.
- లడఖ్లోని తెగల వారికి గిరిజనుల హోదా ఇవ్వాలి.