HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Prime Minister Modis China Tour First Visit After Border Clashes

PM Modi : ప్రధాని మోడీ చైనా టూర్..సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత తొలిసారి పర్యటన!

ఇందులో భారత ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనాకు పర్యటనకు వెళ్లే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో మోడీ బృందం చైనాకు వెళ్లే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • By Latha Suma Published Date - 03:27 PM, Wed - 16 July 25
  • daily-hunt
Prime Minister Modi's China tour...first visit after border clashes!
Prime Minister Modi's China tour...first visit after border clashes!

PM MOdi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో చైనాలో పర్యటించనున్నారని విశ్వసనీయ సమాచారం. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సీ.ఓ) సదస్సు సందర్బంగా ఆయన చైనా పర్యటన జరగనుందని తెలుస్తోంది. ఈ సదస్సు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు తియాంజిన్ నగరంలో జరుగుతుంది. ఇందులో భారత ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనాకు పర్యటనకు వెళ్లే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో మోడీ బృందం చైనాకు వెళ్లే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక చర్చలకు అవకాశం ఉండనుంది. ముఖ్యంగా భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ప్రధాన చర్చాంశంగా ఉండొచ్చని సమాచారం.

Read Also: UIDAI : కీలక సూచన..ఏడేళ్ల లోపు పిల్లల ఆధార్‌కి బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి..తల్లిదండ్రులు జాగ్రత్త!

2020లో లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ప్రధాని మోడీ చైనాలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గల్వాన్ ఘటనలో ఇరుదేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవడం, తదనంతరం ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చైనా-భారత సంబంధాలు ప్రతికూల దిశలో సాగాయి. అయితే తాజాగా సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో రెండు రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బీజింగ్‌కు వెళ్లి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య తాజా పరిణామాలు, సరిహద్దు అంశాలపై ఇద్దరూ చర్చించారని సమాచారం. దీనిని కొనసాగింపుగానే మోడీ పర్యటననూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తొలిసారిగా 2015లో చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు చైనాలో పర్యటించారు. కానీ 2020 ఘర్షణ అనంతరం మోడీ చైనా పర్యటనను విరమించారు. తాజా పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త మలుపు వచ్చే అవకాశం ఉంది. ఎస్.సీ.ఓ సదస్సు లో భాగంగా ద్వైపాక్షిక భేటీలతో పాటు బహుపాక్షిక చర్చలు కూడా జరిగే అవకాశముంది. పశ్చిమాసియా ప్రాంతంలో స్థిరత్వం, ఉగ్రవాద నిర్మూలన, వాణిజ్య సహకారం తదితర అంశాలపై సభ్యదేశాలు మంత్రిత్వస్థాయిలో సమావేశమవుతాయి. ఈ పర్యటన మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమైతే, ఇది భారత-చైనా సంబంధాల మళ్లీ మైనదారిలోకి వచ్చే సూచనగా కూడా పరిగణించవచ్చు.

Read Also: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. టాప్ బ్యాట్స్‌మెన్ ఎవ‌రో తెలుసా?

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Galwan Valley
  • india china relations
  • Ladakh border
  • Modi China tour
  • pm modi
  • SCO Summit
  • Tianjin
  • Vladimir Putin
  • xi jinping

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • GST 2.0

    GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

  • Dhanyavaad Modi JI Padayatra

    Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd