PM Modi: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
- By Balu J Published Date - 02:16 PM, Fri - 22 July 22
ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. 1947 జులై 22వ తేదీన త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని మోదీ వరుస ట్వీట్లు చేశారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో, మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని ప్రధాని అన్నారు. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని మోది గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు.. తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు.
Related News
ECI : ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి ఈసీ అనుమతి
ECI: రానున్న ఎన్నికల్లో(election)ఈవీఎంలు(EVMs), వీవీ ప్యాట్ల(VV Patla) వినియోగానికి అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) లాంఛనంగా ఆదేశాలు జారీ( orders Issuance) చేసింది. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈవీఎంల వినియోగానికి అనుమతించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61ఏ ప్రకారం ఓటింగ్ మెషీన్లకు అనుమతి నిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల డిజైన్లను ఆమోదించినట్టు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర�