No compensation: బీహార్ సీఎం సంచలన నిర్ణయం.. వారికి నష్ట పరిహారం ఇచ్చేది లేదు
బీహార్లో మద్యం వ్యవహారంతో రాజకీయం వేడెక్కింది. ఛప్రా లో కల్తీ మద్యం కారణంగా ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో మద్యం ప్రియుల మరణానికి పరిహారం (Compensation)పై చర్చ మొదలైంది. అయితే ఇలాంటి సందర్భాల్లో పరిహారం (Compensation) ఇవ్వబోమని సీఎం నితీశ్ కుమార్
- By Gopichand Published Date - 06:55 PM, Fri - 16 December 22
బీహార్లో మద్యం వ్యవహారంతో రాజకీయం వేడెక్కింది. ఛప్రాలో కల్తీ మద్యం కారణంగా ఇప్పటివరకు 50 మందికి పైగా చనిపోయారు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో మద్యం ప్రియుల మరణానికి పరిహారం (Compensation)పై చర్చ మొదలైంది. అయితే ఇలాంటి సందర్భాల్లో పరిహారం (Compensation) ఇవ్వబోమని సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) కూడా సభలో స్పష్టం చేశారు.
ఛప్రాలో కల్తీ మద్యం కారణంగా మృతి చెందిన విషయంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ ఘటన తర్వాత విపక్షాలు బీహార్లో మద్య నిషేధం విఫలమయిందని మండిపడ్డారు. ఘటనలో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని మాట్లాడుతున్నారు. దీనిపై సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మద్యం తాగి చనిపోయిన వారికి ఎలాంటి పరిహారం అందదని సీఎం నితీశ్కుమార్ సభలో చెప్పారు.
మద్యం తాగి మరణించిన వారికి నష్టపరిహారం ఇవ్వబోమని సీఎం నితీశ్ కుమార్ గతంలో చాలాసార్లు చెప్పారు. బీహార్లో 2016 నుంచి నిషేధం ఉందని నితీష్ కుమార్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో బీహార్లో మద్యం అమ్మడం, త్రాగడం రెండూ నేరం. ఎవరు తాగినా ఖచ్చితంగా చనిపోతారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నితీష్ కుమార్ చాలా సార్లు ఈ ప్రకటన చేశారు.
దీనితో పాటు బీహార్లో కొన్నేళ్లుగా మద్యపాన నిషేధం ఉందని, కాబట్టి కొంతమంది తప్పులు చేస్తున్నారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నితీష్ కుమార్ బీహార్లో నిషేధానికి సంబంధించి వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. కొద్దిరోజుల క్రితం జేడీయూ కార్యక్రమంలో మరోసారి నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు.
Also Read: Five students Drown: నదిలో ఈతకు దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ఒకరి మృతి
బీహార్లో 2016 నుంచి మద్య నిషేధ చట్టం అమల్లో ఉంది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో విష మద్యం విధ్వంసం ఆగడం లేదు. కల్తీ మద్యం తాగి 6 ఏళ్లలో ఇప్పటివరకు 202 మంది చనిపోయారు. బీహార్లో విషపూరితమైన మద్యం తాగడం వల్ల 2021లో అత్యధికంగా 90 మంది మరణించారు. రాష్ట్రంలో 2020లో, 2019లో 9, 2018లో 9, 2017లో 8, 2016లో 13 మంది మరణించారు. కాగా 2022లో ఇప్పటి వరకు కల్తీ మద్యం తాగి 67 మంది చనిపోయారు. గోపాల్గంజ్, ఛప్రా, బెట్టియా, ముజఫర్పూర్ జిల్లాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి.
Tags
Related News
Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.