Mukesh Ambani: అంబానీ ఖాతాలో మరో లగ్జరీ విల్లా.. ధర ఎంతంటే..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గత కొంతకాలంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు.
- By Gopichand Published Date - 04:57 PM, Thu - 20 October 22
ఈ సంవత్సరం ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ కోసం దుబాయ్లో $80 మిలియన్లతో పది పడక గదుల విల్లాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గత కొంతకాలంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల న్యూయార్క్, దుబాయ్ నగరాల్లో అత్యంత ఖరీదైన విల్లాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్ నగరంలో మరో అత్యంత విలాసవంతమైన విల్లాను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దుబాయ్లోని పామ్ జుమైరా ప్రాంతంలో బీచ్ పక్కన ఉన్న లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారట. ఈ నగరంలో ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ అని తెలుస్తోంది.
ఈ భవంతి ధర దాదాపు రూ.1,349 కోట్లు (163 మిలియన్ డాలర్లు) అని సమాచారం. ఇది దుబాయ్లోని పామ్ జెమైరా దీవిలో ఉంది. కువైట్ వ్యాపారవేత్త మహమ్మద్ అల్షయా నుంచి అంబానీ ఈ భవంతిని కొనుగోలు చేసినట్లు సమాచారం. పామ్ జుమైరా అనేది దుబాయ్లో పామ్ చెట్టు ఆకారంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవుల సముదాయం. ఇందులో అన్నీ విలాసవంత విల్లాలే. కాసా డెల్ సోల్లో ఎనిమిది బెడ్రూమ్లు మరియు 18 బాత్రూమ్లు ఉన్నాయి. ఇది ఒక వ్యాయామశాల, ఒక సినిమా థియేటర్, బౌలింగ్ అల్లే, జాకుజీ మరియు నేలమాళిగలో 15-కార్ల పార్కింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది.
Related News
WhatsApp: భారతదేశం నుండి వెళ్ళిపోతాం అంటున్న వాట్సాప్.. కారణం ఏంటి?
మెసేజ్ ఎన్క్రిప్షన్ను ఉల్లంఘించమని ప్రభుత్వం బలవంతం చేస్తే భారతదేశంలో తమ సేవలను ఉపసంహరించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్. దేశంలో మెసేజ్ ఎన్క్రిప్షన్ పై ఈ రోజు ఢిల్లీ కోర్టులో వాదనల అనంతరం వాట్సాప్ ఈ వ్యాఖ్యలకు పాల్పడింది.