Indian PM Narendra Modi
-
#World
G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!
ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా జరిపిన సైనిక దాడుల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, నావికుల భద్రతను నిర్ధారించడం ప్రపంచ దేశాల సమష్టి బాధ్యత అని ఆయన గట్టిగా నొక్కిచెప్పారు. నిన్న జరిగిన జీ7 అవుట్రీచ్ సెషన్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు […]
Date : 17-06-2026 - 8:55 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్సీసీ ప్రత్యేక డైరెక్టరేట్
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో కీలక ప్రాజెక్టును కేటాయించింది. రాష్ట్రానికి ఎన్సీసీ (నేషనల్ కాడెట్ కార్ప్స్) డైరెక్టరేట్ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్సీసీ హెడ్క్వార్టర్స్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటన విడుదల చేసింది. ఏపీతో పాటుగా జార్ఖండ్కు కూడా డైరెక్టరేట్ను మంజూరు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 17 డైరెక్టరేట్లు ఉండగా.. తాజాగా ఏపీ, జార్ఖండ్లకు కొత్తగా కేటాయించిన వాటితో కలిపి 19కి పెరగనుంది. కొత్తగా డైరెక్టరేట్ ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ఎన్సీసీ […]
Date : 16-06-2026 - 11:37 IST -
#World
Emmanuel Macron: మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆసక్తికర పరిణామం.. దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన ఇమ్మాన్యుయేల్ మేక్రాన్
🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp — Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026 భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు బాలీవుడ్ టచ్ ఇచ్చారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’లోని ప్రముఖ ‘ఆరీ ఆరీ’ పాటను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తూ మోదీ పర్యటనలోని ముఖ్య ఘట్టాలను ఆ వీడియోలో పొందుపరిచారు. సుమారు 30 సెకన్ల నిడివి ఉన్న […]
Date : 15-06-2026 - 12:52 IST -
#Andhra Pradesh
ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు భారీగా నిధులు కేటాయించింది. 16వఆర్థిక సంఘం నిధులు ఏకంగా రూ.16,627 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో బేసిక్ గ్రాంట్ రూ.13,302 కోట్లు కాగా.. పెర్ఫార్మెన్స్ గ్రాంట్ రూ.3,225 కోట్లు ఉన్నాయి. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు రాష్ట్రానికి ఈ నిధులు విడుదల చేయనుంది. గత ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12,800 కోట్లు కేటాయించారు. […]
Date : 13-06-2026 - 10:29 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. “ఐదు కోట్ల ప్రజల అపారమైన నమ్మకంతో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. గత […]
Date : 12-06-2026 - 12:07 IST -
#Cinema
Bharathiraja: భారతీరాజా కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు: ప్రధాని మోదీ
ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భారతీయ సినీ రంగంలో ఒక మహోన్నత వ్యక్తిగా భారతీరాజాను అభివర్ణించారు. సినీ రంగానికి భారతీరాజా చేసిన సేవలను మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన సినిమాలు తమిళ సినీ రంగాన్ని కొత్త దిశగా నడిపించాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ జీవితాన్ని తెరపై సహజంగా చూపించిన తీరు ప్రత్యేకమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. […]
Date : 11-06-2026 - 11:51 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతికి కీలక ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2534 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. రూ. 2,534 కోట్లతో అమరావతిలో సెంట్రల్ […]
Date : 10-06-2026 - 3:34 IST -
#India
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ సంచలన రికార్డు.. నెహ్రూ రికార్డు బ్రేక్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు నిరవధికంగా సేవలు అందించిన ప్రధానిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. బుధవారం నాటికి ప్రధానిగా 12 ఏళ్ల (4,399 రోజులు) పదవీకాలాన్ని మోదీ పూర్తి చేసుకున్నారు. 1952లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నెహ్రూ పదవీకాలాన్ని (4,398 […]
Date : 10-06-2026 - 10:38 IST -
#India
PM Modi: జవహర్లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.
భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును మోదీ అధిగమించనున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. జూన్ 10 నాటికి వరుసగా 4,399 రోజుల పాలనను పూర్తి చేసుకోనున్నారు. దేశంలో మొదటి […]
Date : 03-06-2026 - 5:07 IST -
#South
Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్ మంత్రి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు ఇళ్లలో పనిచేసి నెలకు రూ.2,500 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకున్న కలిత మాఝీ, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆమె, సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఆమె జీవిత ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఎవరీ కలిత మాఝీ? పూర్బ బర్ధమాన్ జిల్లాలోని ఆస్గ్రామ్ […]
Date : 02-06-2026 - 10:16 IST -
#India
Rahul Gandhi: సీబీఎస్ఈపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ బోర్డుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 12వ తరగతి డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓ ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను తుంగలో తొక్కడం వల్లే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ధ్వజమెత్తారు. ఒక్క కంపెనీ కోసం? ఈ వివాదంపై పరిశోధన చేసిన విద్యార్థి సార్థక్ […]
Date : 01-06-2026 - 12:53 IST -
#India
PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..
నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్య, భద్రత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ తరఫున మోదీని వైట్హౌస్కు ఆహ్వానించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా మధ్య వాణిజ్యం విషయంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా రాయబారి ట్వీట్ […]
Date : 23-05-2026 - 5:17 IST -
#India
Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఒక సమన్వయ యంత్రాంగాన్ని రూపొందించాలని నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రులందరితో తక్షణమే ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపును తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, ఇలాంటి క్లిష్ట సమయాల్లో జాతీయ బాధ్యత అనేది […]
Date : 22-05-2026 - 4:21 IST -
#India
Pm Modi: ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ భేటీ.. కీలక రంగాలపై స్పెషల్ ఫోకస్!
‘వికసిత్ భారత్ 2047’ కేవలం ఒక నినాదం కాదని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ఒక బాధ్యతగా, బలమైన నిశ్చయంగా భావించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి ఇది ఒక మధ్యంతర సమీక్షగా నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం, ప్రధాని ఐదు దేశాల పర్యటన, ఇంధన పొదుపుపై పటిష్ఠ చర్యల నేపథ్యంలో […]
Date : 22-05-2026 - 8:57 IST -
#India
Rahul Gandhi: మోడీ దేశద్రోహి : రాహుల్గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ‘దేశద్రోహి’ అని విమర్శించారు. దేశాన్ని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన మీకు ధన్యవాదాలు. ఇంటికి వెళ్లాక మీ దగ్గరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి మోదీ, అమిత్ షా గురించి మాట్లాడితే దీటుగా సమాధానం ఇవ్వండి. మీ ప్రధాని, […]
Date : 20-05-2026 - 2:40 IST