ISRO: చంద్రయాన్ కి గుడ్ లక్ చెప్పిన మోదీ.. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందంటూ?
భారత అంతరిక్ష సంస్థ అయినా ఇస్రో తాజాగా అత్యంతప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగించింది. అంతా సాఫీగా సాగడంతో తాజాగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ
- By Nakshatra Published Date - 04:14 PM, Fri - 14 July 23
భారత అంతరిక్ష సంస్థ అయినా ఇస్రో తాజాగా అత్యంతప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగించింది. అంతా సాఫీగా సాగడంతో తాజాగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీనితో భారత ప్రజల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెల్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో గొప్ప గొప్ప ప్రముఖులు భారత అంతరిక్ష సంస్థకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఈ సందర్భంగా తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు అని తెలిపారు. అంతరిక్ష రంగంలో జులై 14,2023 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. చంద్రుడి పైకి చంద్రయాన్-3 ప్రయాణం మెదలవుతుంది. ఈ మిషన్ కోట్లాది మంది భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్తుంది అని మోదీ ట్వీట్ చేశారు. అలాగే భవిష్యత్తులో జాబిల్లి జనావాసంగా మారొచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రయాన్-1 ప్రయోగం ముందువరకు చందమామ పై ఒక్క చుక్క కూడా నీరు ఉండదని అభిప్రాయపడేవారు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది. ఇక ఇది భవిష్యత్తులో జనావాసంగా మారవచ్చు అని ఆకాక్షించారు మోదీ. అలాగే తాజా ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ప్రస్తుత ప్రయోగంపై దృష్టి సారించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags
Related News
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ప్రోమో వీడియో వైరల్..!
T20 వరల్డ్ కప్ 2024.. IPL 2024 ఫైనల్ తర్వాత ప్రారంభమవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.