HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Modi Gave A Big Shock To Farmers

PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ

PM Kisan : దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధిదారుల పేర్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పథకంలో ఉన్న రైతుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా కేంద్రం పెద్దఎత్తున సవరణలు చేపట్టడంతో

  • Author : Sudheer Date : 04-11-2025 - 9:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Kisan funds released.. Check if the money has been deposited in your account like this!
PM Kisan funds released.. Check if the money has been deposited in your account like this!

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధిదారుల పేర్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పథకంలో ఉన్న రైతుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా కేంద్రం పెద్దఎత్తున సవరణలు చేపట్టడంతో ఈ సంఖ్య తగ్గిపోయింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌–మార్చి మధ్య 10,06,85,615 మంది రైతులు ఈ పథకం కింద డబ్బు పొందగా, 2025–26 ఏప్రిల్‌–జులై మధ్య కాలానికి అది 9,71,41,402కు తగ్గిపోయింది. అంటే నాలుగు నెలల్లోనే 35,44,213 మంది రైతుల పేర్లు తొలగించబడ్డాయి. జులై తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నందున, ప్రస్తుతం తొలగించిన వారి సంఖ్య 60 లక్షల దాకా చేరి ఉండొచ్చని అంచనా.

Mobile Plans Prices: డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

ఈ తొలగింపుల వెనుక రెండు ప్రధాన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. మొదటిది – పథకం దుర్వినియోగాన్ని అరికట్టడమే. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, ఒకే కుటుంబంలో భార్యాభర్త ఇద్దరూ లబ్ధిపొందడం వంటి సందర్భాలు అనేక రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. ఇలాంటి అనర్హుల పేర్లను గుర్తించి తొలగించడం ద్వారా నిజమైన రైతులు మాత్రమే లబ్ధి పొందేలా కేంద్రం కృషి చేస్తోంది. రెండవ కారణం ఆర్థిక ప్రణాళికకు సంబంధించినది. త్వరలో పీఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి ఇచ్చే రూ.6,000 లబ్ధిని రూ.9,000కు పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇందుకోసం అదనపు నిధులు అవసరమవుతాయి. అందుకే అనర్హులను తొలగించడం ద్వారా ఆదా అయ్యే డబ్బును అదే పథకంలో అర్హులైన రైతుల లబ్ధి పెంచేందుకు వినియోగించాలనే ఆలోచనతో ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

ఇప్పటికే తొలగించిన 35 లక్షల పేర్లతో కేంద్రానికి సుమారు రూ.2,126 కోట్లు ఆదా కాగా, మరిన్ని పేర్లు తొలగిస్తే మొత్తం ఆదా రూ.5,000 కోట్ల దాకా చేరే అవకాశముంది. ఈ డబ్బుతో లబ్ధిని రూ.9,000కు పెంచే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు సూచిస్తున్నాయి. అయితే ఈ తొలగింపుల వల్ల పీఎం కిసాన్ 21వ విడత చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకా డబ్బు జమ కాలేదు. రైతులు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

https://pmkisan.gov.in వెబ్‌సైట్‌లో “Know Your Status” మరియు “eKYC” ఆప్షన్ల ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. తప్పుగా పేరు తొలగించబడితే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హత ఉన్న రైతులు తమ సమాచారాన్ని సరిచేసి అప్డేట్‌గా ఉంచుకుంటే, పథకం లబ్ధిని నిరంతరంగా పొందవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • farmers
  • farmers removed from beneficiary-listpm kisan latest news telugu
  • Modi gave a big shock
  • pm kisan
  • pm kisan status

Related News

    Latest News

    • ‎పీరియడ్స్ నొప్పిని ఖతం చేసే నాలుగు రకాల పానీయాలు.. ఎలా తాగాలో తెలుసా?

    • ‎చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో మీకు తెలుసా?

    • ‎బరువు తగ్గడం కోసం చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి!

    • ‎పగిలిన విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం!

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    Trending News

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd