Modi Bridge : సముద్రం మీద మోడీ మార్క్ బ్రిడ్జి! దేశానికే తలమానికం!
సముద్రంపైన వంతెన(Bridge) నిర్మాణం ముంబైలో జరుగుతోంది.
- By CS Rao Published Date - 12:05 PM, Mon - 16 January 23
దేశానికే ఐకాన్ గా నిలిచే సముద్రంపైన వంతెన(Bridge) నిర్మాణం ముంబైలో జరుగుతోంది. చివరి దశకు చేరుకున్న ఆ వంతెన భారత ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తోది. ప్రస్తుతం ముంబై(Mumbai) నుండి నవి ముంబై రావడానికి ట్రాఫిక్ కు అనుగుణంగా ప్రయాణ సమయం 2.30 గంటలు నుండి 3 గంటల సమయం పడుతోంది. ఈ ప్రయాణ సమయం తగ్గించ డానికి సముద్రం మీదుగా(Bridge) సుమారు ₹17వేల కోట్ల ఖర్చుతో దేశం లోనే అతి పొడవైన 22కి.మీ పొడవు గల వంతెన నిర్మిస్తున్నారు. ఇది నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది నవంబర్ నుంచి దీనిని ప్రజల కోసం తెరుస్తారు.
సముద్రంపైన వంతెన నిర్మాణం (Bridge)
ఈ వంతెన వల్ల ముంబై మరియు నవీ ముంబాయ్(Mumbai) మధ్య ప్రయాణ సమయం (ట్రాఫిక్ బట్టీ) ప్రస్తుత ప్రయాణ సమయం కంటే కనీసం 20నిమిషాలకి తగ్గుతుంది. అలాగే ముంబై పుణె మధ్య ప్రస్తుతం ఉన్న 3.30 గంటల ప్రయాణ సమయం 90 నిమిషాలకు తగ్గిపోతుంది. అంటే ఎంత ప్రయాణ సమయం, ఎంత ఆయిల్ ఆదా అవుతుందో ఊహిస్తూ లెక్కిస్తున్నారు. అందుబాటులో వచ్చే సమయం కోసం ముంబాయ్ వాసులు ఎదురుచూస్తున్నారు.
Also Read : PM Modi Tour: తెలంగాణకు మోడీ.. ‘వందే భారత్’ కు గ్రీన్ సిగ్నల్!
ఈ వంతెన దేశంలో నిర్మించిన అన్ని వంతెనలు కన్నా పొడవైనది. ఇది 6-లేన్ ఎక్స్ప్రెస్వే గ్రేడ్ రోడ్ వంతెన. ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవ్రిలో ప్రారంభమవుతుంది. ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన థానే క్రీక్ను దాటుకుని, నవా షెవా సమీపంలోని చిర్లే వద్ద ముగుస్తుంది . తూర్పున ముంబై-పూణే ఎక్స్ప్రెస్ వే మరియు పశ్చిమాన నిర్మాణంలో ఉన్న కోస్టల్ రోడ్డు కి అనుసంధానం చేస్తారు . ఈ 6-లేన్ హైవే బ్రిడ్జి 27 మీటర్ల వెడల్పుతో రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేన్లు, ఎడ్జ్ స్ట్రిప్ మరియు క్రాష్ బారియర్తో ఉంటుంది.
ప్రతిష్టాత్మకమైన ఈ వంతెన నిర్మాణం 2018లో ప్రారంభం అయింది. నాలుగున్నర సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోవిడ్ వల్ల నిర్మాణం కారణంగా కాస్త ఆలస్యం అయింది. దీని మీద రోజుకు 70వేల వాహనాలు తిరుగుతాయి అని అంచనా. ఇటువంటి బ్రిడ్జి నిర్మించాలి అని 1962 లోనే అనుకున్నారు.అప్పట్లో 18 నెలల పాటు స్టడీ చేసి 1963లో రిపోర్టు ఇచ్చారు. ఆ తరువాత దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు.
యూపీఏ హయాంలో అనుకున్నా..(Mumbai)
యూపీఏ హయాంలో( 2004లో) సీరియస్ గా అనుకున్నా ఎందుకో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పక్కన పడేసింది. మళ్ళీ 2005 నుండి 2014 మధ్య చాలా సార్లు అనుకున్నా ప్రాజెక్ట్ ముందుకు నడవలేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఫడ్నవిస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు ముందుకు కదిలింది. మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు 2016 డిసెంబరు లో మోడీ శంఖుస్థాపన చేశారు. అన్ని క్లియరెన్స్ లు 2017 కి సంపాదించి 2018లో నిర్మాణం మొదలు పెట్టారు.
Also Read : PM Modi: పాత నోట్లను రద్దు చేసి మూల్యం చెల్లించుకున్న దేశాలు ఇవే..?
సముద్రంలో తిరిగే షిప్పులకు ఆటంకం లేకుండా సముద్రంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి కొన్ని ప్రాంతాలలో కాంక్రీట్ పిల్లర్లు వేయకుండా భారీ ఇనుప గ్రడ్డర్స్ ఉపయోగించారు. అన్నిటి కన్నా పొడవైన ఒక ఇనుప గ్రడ్డర్ 160 మీటర్లు ఉంది. మొత్తం బ్రిడ్జిలో సుమారు 6.40కి.మీ మేర ఈ ఇనుప గ్రడ్డర్స్ ఉపయోగించారు. దీని నిర్మాణంలో 1.65.లక్షల టన్నుల రీ ఇన్ఫోర్స్మెంట్ స్టీల్, సుమారు 96 వేల టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, 8.30.లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రెట్ ఉపయోగిస్తున్నారు. మోడీ వచ్చాక నిర్మిస్తున్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లలో ఈ సముద్రం మీద లింక్ బ్రిడ్జి దేశంలోనే ఒక ముఖ్య మైన నిర్మాణంగా చరిత్రలో లిఖించ బడుతుంది.
Related News
Retail Mogul : డీమార్ట్ ఓనర్ బిగ్ డీల్.. రూ.117 కోట్లతో ఎకరం భూమి కొనుగోలు
Retail Mogul : డీమార్ట్ బిజినెస్ శరవేగంగా దేశమంతటా వ్యాపించింది.