Modi Contest Malkajgiri: మల్కాజిగిరి నుంచి మోడీ పోటీ? రేవంత్ ఔట్! సౌత్ సందడి
మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ (BJP) లక్ష్యం.
- By CS Rao Published Date - 11:52 AM, Sat - 7 January 23
తెలంగాణలో (Telangana) అధికారాన్ని కోరుకుంటున్న బీజేపీ ఈ సారి ఎన్నికల్లో ప్రధాని మోడీ (PM Modi)తో ఏదో ఒక లోకసభ నుంచి పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణ శాఖ రెండు స్థానాలను సూచించినట్టు తెలుస్తుంది. ఇటీవల వరకు దక్షిణ భారత్ నుంచి ఈ సారి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తమిళనాడు నుంచి పోటీ చేస్తారని బీజేపీ లో అంతర్గతంగా చర్చ జరిగింది. కానీ , ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తే బహుముఖ లాభాలు పొందదానికి అవకాశం ఉందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారట. తెలంగాణలోని రెండు లోక్ సభ స్థానాల పైన కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ నేతలోని టాక్. మినీ ఇండియాగా చెప్పుకొనే మల్కాజ్ గిరి (Malkajgiri) లేదా మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి చెప్పుకొనే స్థాయిలో ఆదరణ ప్రస్తుతం ఉంది. సికింద్రాబాద్ బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయటం వలన నగరంతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపైన ప్రభావం ఉంటుందని అంచనా. ఒక వేళ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే అక్కడ బీజేపీకి లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచే ఎంపీగా గెలుపొందారు. జైపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది.
ప్రధాని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారని చెప్పటం ద్వారా పాజిటివ్ వేవ్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ లో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత 2024లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రధాని మోదీ (PM Modi) తెలంగాణలో పోటీ చేసే అంశం పైన అధికారికంగా ప్రకటనకు బీజేపీ సిద్దం అవుతోంది. ఫలితంగా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఖచ్చితంగా సానుకూలత పెరుగుతోందని అంచనా వేస్తోంది. ప్రధాని మోదీ తెలంగాణ పైన ఫోకస్ చేసారని అందరికి తెలిసిందే. తెలంగాణలో ప్రధాని పోటీ పైన తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత కాలం పట్టనుంది. ఆ దిశగా ఆలోచనలు ఉన్నాయని బీజేపీ తెలంగాణ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
వారణాశి నుంచి ఎంపీగా ఉన్న ప్రధాని మోడీ (PM Modi) అక్కడ ఏ విధంగా డెవలప్ చేసారో అదే మంత్రం ఇక్కడ ప్రచారం చేస్తే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేసే అంశం పైన బీజేపీ ఎంపీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధాని పోటీ ఖాయమైతే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరం కానున్నాయి. గతంలో సోనియా , ఇందిరా ఉమ్మడి ఏపీలో పోటీ చేసి గెలుపొందారు. అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మరో సంచలనంగా మార్చ నుంది. అందులో భాగంగా తెలంగాణ నుంచి రెండు లోక్ సభ స్థానాల పైన సర్వేలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఒక బీజేపీ ఎంపీ ఖరారు చేసారు. ప్రధాని పోటీ చేసే నియోజకవర్గం పైన తుది నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలక నుంది.
దక్షిణాది నుంచి మోడీ పోటీ ?
కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ (BJP) లక్ష్యం. అదే సమయంలో ఈ సారి దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ ఫోకస్ చేసింది. ఈ ఏడాది కర్ణాటక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో మోడీ చరిష్మాను బీజేపీ నమ్ముకుంది. టీడీపీ కి పట్టున్న మల్కాజ్ గిరి మోడీ పోటీకి సరైన ప్లేస్ గా బీజేపీ భావిస్తుంది. ఒక వేళ పొత్తు బీజేపీ, టీడీపీ ఖరారు అయితే మల్కాజిగిరి లోకసభ నుంచి మోడీ పోటీకి అనుకూలం.లేదంటే మహబూబ్ నగర్ కూడా అనుకూలంగా ఉందని సర్వే ల సారాంశం. మొత్తం మీద మోడీ హవా దక్షిణాదిన ఉండబోతుంది. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ (Revanth) మల్కాజిగిరి నుంచి ఈ దారి పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తుంది.
Related News
PM Modi : మైనారిటీలకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు : మోడీ
మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.