Ministry Of Finance Employee: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి దుర్మరణం..!
వారు మోటార్సైకిల్పై వెళ్తుండగా కారు సెంట్రల్ డివైడర్ను ఢీకొని వారి వాహనాన్ని తాకింది. ఈ ప్రమాదంలో నవజోత్ సింగ్ ఒక బస్సుకు తగిలి గాయపడ్డారు.
- By Gopichand Published Date - 10:19 PM, Sun - 14 September 25

Ministry Of Finance Employee: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న నవజోత్ సింగ్ (Ministry Of Finance Employee) కారు ప్రమాదంలో మరణించారు. ఆయన తన భార్యతో కలిసి బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. ధౌలా కువాన్ సమీపంలో ఒక బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవజోత్ సింగ్ భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది.
ప్రమాదం ఎలా జరిగింది?
ప్రమాదం ధౌలా కువాన్ పిల్లర్ నెం. 57 నుంచి రాజా గార్డెన్ సమీపంలో జరిగింది. నవజోత్ సింగ్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించకుండా 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్లోని న్యూలైఫ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకునేసరికి అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధౌలా కువాన్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ రోడ్డు వైపు ట్రాఫిక్ జామ్ గురించి మూడు పీసీఆర్ కాల్స్ వచ్చాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, ఒక బీఎండబ్ల్యూ కారు అడ్డంగా పడి ఉందని, ఒక మోటార్సైకిల్ మెట్రో పిల్లర్ నెం. 67 వద్ద డివైడర్ దగ్గర ఉందని గుర్తించారు.
Also Read: Hardik Pandya: పాక్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సరికొత్త రికార్డు!
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక మహిళ కారు నడుపుతూ మోటార్సైకిల్ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆమె తన భర్తతో కలిసి టాక్సీలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి ఒకరు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు సమాచారం అందింది.
ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందాన్ని కూడా అక్కడికి పిలిపించారు. నిందితురాలైన మహిళ, ఆమె భర్త కూడా గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ కేసుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరణించిన నవజోత్ సింగ్ భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు. అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది.
వారు మోటార్సైకిల్పై వెళ్తుండగా కారు సెంట్రల్ డివైడర్ను ఢీకొని వారి వాహనాన్ని తాకింది. ఈ ప్రమాదంలో నవజోత్ సింగ్ ఒక బస్సుకు తగిలి గాయపడ్డారు. నిందితులు గురుగ్రామ్లో నివసిస్తున్నట్లు తెలిసింది. నిందితురాలి భర్త ఒక వ్యాపారవేత్త అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు.