HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Manish Sisodia Says Bjp Conspiracy To Assassinate Cm Kejriwal

BJYM Attacks Kejriwals House: సీఎం కేజ్రివాల్ హ్య‌త్య‌కు కుట్ర..?

  • By HashtagU Desk Published Date - 12:26 PM, Thu - 31 March 22
  • daily-hunt
Bjym 'attacks' Kejriwal's House
Bjym 'attacks' Kejriwal's House

దేశంలో ద క‌శ్మీర్ ఫైల్స్ మూవీ ర‌గ‌డ కొనసాగుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ పై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల డిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ కూడా క‌శ్మీర్ ఫైల్స్ చిత్రం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ మూవీకి టాక్స్ మిన‌హాయింపు ఇవ్వాల‌ని తాజాగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై స్పందించిన కేజ్రివాల్ ఈ సినిమాను యూట్యూబ్‌లో పెడితే అంద‌రూ ఫ్రీగా చూస్తార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అసెంబ్లీలో అర‌వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్న రాష్ట్రాలపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. క‌శ్మీర్ ఫైల్స్ మూవీని యూట్యూబ్‌లో పెడితే అందరికీ అందుబాటులో వస్తుంద‌ని, దీంతో ఈ సినిమాను అంద‌రూ ఉచితంగా చూడొచ్చు కదా అని కేజ్రీవాల్ వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు కోట్ల రూపాయలను దండుకుంటున్నార‌ని మండిప‌డిన కేజ్రివాల్, బీజేపీ వాళ్లు మాత్రం సినిమా పోస్టర్లు వేసే పనిలో నిమగ్నమయ్యారని సెటైర్ వేశారు.

ఈ నేప‌ధ్యంలో కశ్మీర్ ఫైల్స్ మూవీ పై కేజ్రీవాల్ చేసిన‌ వ్యాఖ్యల పై భ‌గ్గుమన్న బీజేపీ శ్రేణులు ఆందోళ‌ణ‌లు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఢిల్లీలోని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ యువమోర్చా చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్య‌మంత్రి కేజ్రివాల్ ఇంటి వద్దకు భారీగా చేరిన యువ కాషాయ‌ద‌ళం కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే బారికేడ్లను దాటుకుని వెళ్లి కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు, గేటును ధ్వంసం చేశారు. కేజ్రీవాల్ ఇంటి గేటుకు కాషాయ రంగు చల్లారు.

బీజేపీ యుమోర్చా అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య నాయకత్వంలో ఈ ఆందోళన జరిగింది. తేజస్వీ సూర్య స్వయంగా బారికేడ్లు ఎక్కారు. సూర్య బారికేడ్లు దూకుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు 200 నుంచి 300 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు స‌మాచారం. అయితే కేజ్రివాల్ ఇంటి ముందు ఆందోళ‌ణల‌కు దిగిన‌ నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు, భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య స‌హా పలువురు బీజేవైఎం కార్య‌కర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇక ఢిల్లీలో కేజ్రివాల్ నివాసం వ‌ద్ద‌, బీజేవైఎం కార్య‌క‌ర్త‌లు చేపట్టిన‌ ఆందోళనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసింది. సీఎం కేజ్రీవాల్‌ ఇంటి వద్ద బీజేపీ గూండాలు విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కశ్మీర్ పండిట్లకు పునరావాసం కల్పించాల్సిందిపోయి సినిమా తీస్తే ఏమొస్తుందని ఆప్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆప్ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ బీజేపీ ప్ర‌భుత్వం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌కీయాల్లో కీల‌క అడుగులు వేస్తున్న‌ అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ ప్లాన్ వేస్తుంద‌ని, పంజాబ్‌లో ఓటమిని తట్టుకోలేక కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మ‌రి ఈ వ్య‌వ‌హారం పై బీజేపీ పెద్ద‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aam admi party
  • arvind kejriwal
  • bjp
  • BJYM
  • Kejriwals House
  • Manish Sisodia

Related News

Cbi Kcr

CBI Enquiry on Kaleshwaram Project : కేసీఆర్ పై యాక్షన్ ..? బిజెపి భయపడుతోందా..? కారణం అదేనా..?

CBI Enquiry on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖపై కేంద్రం తీసుకునే నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

Latest News

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd